కట్టుకున్న వాడే కుట్ర.. ‘కాల్ గర్ల్స్ కావాలా?’ పేరుతో ప్రకటన సృష్టించి..
‘హలో.. రేటెంత?’ అంటూ అటు వైపు నుంచి వరుసగా ఫోన్లు మోతెక్కుతుంటే ఆమెకు నోటి మాట రావడం లేదు. ఆమె సోదరులకూ ఆగంతకులు ఫోన్లు చేసి ‘అమ్మాయి.. ఉందా?’ అంటూ ప్రశ్నిస్తుంటే ఆందోళనకు గురై.. చివరికి పోలీస్ ఠాణాకు పరుగులు తీసి సాయం అర్థించారు.
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : ‘హలో.. రేటెంత?’ అంటూ అటు వైపు నుంచి వరుసగా ఫోన్లు మోతెక్కుతుంటే ఆమెకు నోటి మాట రావడం లేదు. ఆమె సోదరులకూ ఆగంతకులు ఫోన్లు చేసి ‘అమ్మాయి.. ఉందా?’ అంటూ ప్రశ్నిస్తుంటే ఆందోళనకు గురై.. చివరికి పోలీస్ ఠాణాకు పరుగులు తీసి సాయం అర్థించారు. అధికారులు ఆ ఫోన్ల వ్యవహారంపై తీగలాగితే దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల సాయంతో.. సామాజిక మాధ్యమాల ద్వారా తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు భర్తపైనే ఆ భార్య బెంగళూరు నందినిలేఔట్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు.
పోలీసులు అందించిన వివరాల్లోకి వెళితే.. ఆ భార్యాభర్తలిద్దరికీ కొన్నాళ్లుగా సరిపోవడం లేదు. భర్త నుంచి విడాకుల కోసం ఆమె న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కోపంతో భర్త ఓ కుట్ర పన్నాడు. ఫేస్బుక్లో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్నెంబర్లు పొందుపరచి, ‘కాల్ గర్ల్స్ కావాలా?’ అంటూ ప్రకటన సృష్టించి, విదేశాలకు వెళ్లిపోయాడు. దాన్ని చూసిన అనేక మంది వారికి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఫేస్బుక్లో ఓ పేజ్ సృష్టించి, వారిని సతాయించినట్లు పోలీసులు వివరించారు. బాధితురాలు ఆ వ్యక్తిని 2019లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి శారీరక, మానసిక, చిత్రహింసలకు గురి చేస్తున్నాడనే వాటిని తట్టుకోలేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే నిందితుడు సామాజిక మాధ్యమ వేదికగా కొత్త కుట్రలకు తెరలేపడంతో పోలీసులు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.