logo

పేదల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన

పేదల సమస్యలు పరిష్కరించాలంటూ  ఇల్లందు ఎంపీడీవో కార్యాలయంలో  సీపీఎం ఆధ్వర్యంలో  నిరసన వ్యక్తం చేశారు.

Published : 11 Jun 2024 12:51 IST

ఇల్లందు గ్రామీణం: పేదల సమస్యలు పరిష్కరించాలంటూ  ఇల్లందు ఎంపీడీవో కార్యాలయంలో  సీపీఎం ఆధ్వర్యంలో  నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని,  మంచినీటి సమస్యను పరిష్కరించాలని  సీపీఎం జిల్లా నాయకుడు అబ్దుల్ నబీ డిమాండ్ చేశారు.  అదేవిధంగా యాకయ్య నగర్‌లో ఐదేళ్లుగా తాగునీరు, మౌలిక సదుపాయాలు తదితర సమస్యలతో  పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా వారికి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆలస్యం చేసిన అధికారులు ఇకనైనా సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని