Revanth Reddy: ముఖ్యమంత్రి.. ముత్యాల తలంబ్రాలు తెచ్చేనా..?
భద్రాచలం శ్రీసీతారామచంద్రసామి దేవస్థానంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రసామి దేవస్థానంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ప్రచార గోడపత్రికలను ఇప్పటికే సీఎం ఆవిష్కరించారు. ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను ఆలయాధికారులు అందిస్తున్నారు. స్వాగత ద్వారాలు ఏర్పాటుచేయనున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి అధికారికంగా ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకురావటం ఆనవాయితీ. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీరామనవమి వేడుకలకు వస్తానని ఇటీవల భద్రాచలం పర్యటన సందర్భంగా వెల్లడించారు. అయితే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. కోడ్ అమల్లోకి వస్తే ప్రజాప్రతినిధులకు ఆలయాల్లో ప్రొటోకాల్ వర్తించదు. ఈ పరిస్థితుల్లో సీఎం వస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది.
ఎన్నికల కమిషన్కు లేఖ రాయాలని..
భద్రాచలం రాములవారికి పాలకులు ముత్యాల తలంబ్రాలు తీసుకురావటమనేది శతాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్కు లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి తరుణంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా తలంబ్రాలను తీసుకొచ్చే అవకాశం సీఎంకు కల్పించాలని లేఖ ద్వారా కోరనున్నారు. ఆలయాన్ని నిర్మించిన భక్తరామదాసు కాలంలో చోటుచేసుకున్న ఘటనల సారాంశాన్ని పొందుపర్చి, తానీషా ప్రభువు స్వయంగా తలంబ్రాలను తీసుకొచ్చిన చరిత్రను లేఖలో వివరించనున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టతకు ఇంకొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. అనివార్య కారణాలతో ముఖ్యమంత్రి రాకపోతే దేవాదాయశాఖ కమిషనర్తో పాటు ముఖ్యమైన అధికారులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించే వీలుంది. పట్టాభిషేకానికి గవర్నర్ రావటం ఆనవాయితీగా వస్తోంది. ఈ రెండు వేడుకలకు సంబంధించిన సెక్టార్ టికెట్లను ఆన్లైన్లో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!