స్వార్థ ప్రయోజనాలకే పార్టీ మారుతున్నారు: సత్యవతి రాథోడ్
భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నడికుడిలో శుక్రవారం నిర్వహించారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
దుమ్ముగూడెం, న్యూస్టుడే: భారాస నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నడికుడిలో శుక్రవారం నిర్వహించారు. అనంతరం విలేకరులతో సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, భారాస అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును నియోజకవర్గ భారాస నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి గెలిపించారని, చివరకు వారిని నట్టేట ముంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. ఎమ్మెల్యే వెంకట్రావు సొంత మండలం దుమ్ముగూడెంలో నిర్వహించిన సమావేశానికి భద్రాచలం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో భారాస శ్రేణులు తరలివచ్చాయని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థి మాలోత్ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చి ఆ పథకాలను అమలు చేయడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయ కక్షతోనే భారాస అధినేత కేసీఆర్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. భాజపా ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్, కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ కాలం చెల్లిన నాయకులు అని అభివర్ణించారు. గతంలో వీరిద్దరూ ఎంపీగా గెలిచినా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఖమ్మం ఎంపీ సీటును తమ కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ను ఓడించి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని, ఇప్పటికే కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలిపారు. సమావేశంలో భారాస నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, సాగి శ్రీనివాసరాజు, ఎంపీపీ రేసు లక్ష్మి, అన్నె సత్యనారాయణమూర్తి, కణితి రాముడు, ఎండీ.జానీపాషా, కొత్తూరి సీతారామారావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం