logo

సొంతగూటికి చేరిన కౌన్సిలర్లు

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐని వీడి భారాసలో చేరిన కొత్తగూడెం మున్సిపల్‌ కౌన్సిలర్లు మాచర్ల రాజకుమారి, బోయిన విజయ్‌కుమార్‌, పి.సత్యనారాయణాచారి, నేరెల్ల సమైక్యలు తిరిగి సొంత గూటికి చేరారు.

Updated : 13 Apr 2024 05:41 IST

పార్టీలో చేరిన కౌన్సిలర్లు, నాయకులతో ఎమ్మెల్యే కూనంనేని, సాబీర్‌పాషా తదితరులు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీపీఐని వీడి భారాసలో చేరిన కొత్తగూడెం మున్సిపల్‌ కౌన్సిలర్లు మాచర్ల రాజకుమారి, బోయిన విజయ్‌కుమార్‌, పి.సత్యనారాయణాచారి, నేరెల్ల సమైక్యలు తిరిగి సొంత గూటికి చేరారు. పట్టణంలోని శేషగిరిభవన్‌లో శుక్రవారం జరిగిన  కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆయా కౌన్సిలర్లకు పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. మాజీ సర్పంచి కాశీవిశ్వనాథ్‌, నాయకులు మాచర్ల  శ్రీనివాస్‌, పిడుగు శ్రీనివాస్‌, బాబూరావు, బి.శ్రీనివాస్‌, వాసు, రామంచి శ్రీను, కుమార్‌, సుధాకర్‌, లాలు, సుభాని తదితరులు సీపీఐలో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, నాయకులు   చంద్రగిరి శ్రీను, దుర్గరాశి వెంకన్న, సలిగంటి శ్రీనివాస్‌, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని