ఆలోచించండి.. అజ్ఞాతం వీడండి: ఎస్పీ రోహిత్రాజు
నిజంగా ఏవైతే సిద్ధాంతాలతో అడవిబాట పట్టారో.. ఇప్పుడా సిద్ధాంతాలు బతికున్నాయా? లేదా? అనేది ఆలోచించండి. ఇప్పటికైనా మావోయిస్టులు అజ్ఞాతం వీడి, కొత్త జీవితంలోకి రావాలని జిల్లా ఎస్పీ రోహిత్రాజు పిలుపునిచ్చారు.
ఆపరేషన్ చేయూతలో లొంగిపోయిన నలుగురు దళసభ్యులతో అధికారులు
చర్ల, న్యూస్టుడే: నిజంగా ఏవైతే సిద్ధాంతాలతో అడవిబాట పట్టారో.. ఇప్పుడా సిద్ధాంతాలు బతికున్నాయా? లేదా? అనేది ఆలోచించండి. ఇప్పటికైనా మావోయిస్టులు అజ్ఞాతం వీడి, కొత్త జీవితంలోకి రావాలని జిల్లా ఎస్పీ రోహిత్రాజు పిలుపునిచ్చారు. ఆపనేషన్ చేయూతలో భాగంగా చర్ల పోలీసుస్టేషన్లో మావోయిస్టుల కుటుంబ సభ్యులతో శుక్రవారం ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్లో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) టి.సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. జిల్లాకు చెందిన 13 మంది ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని.. ఇందులో 10 మంది చర్ల మండలానికి చెందిన వారు ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. చిన్నపాటి కారణాలతో మావోయిస్టు పార్టీలో చేరినవారు దూరదృష్టితో ఆలోచించాలని ఆయన సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అమాయకులతో చట్టవ్యతిరేక పనులు చేయించి వారి జీవితాలను చిధ్రం చేస్తోందని ఆక్షేపించారు. దళంలో చేరిన ఈ పది మంది సుఖంగా ఉంటున్నారో లేదో కుటుంబ సభ్యులు ఆలోచించాలన్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద క్యాడర్ ఎవరైనా చనిపోయారా? చిన్న స్థాయి క్యాడర్వారే చనిపోతున్నారని వివరించారు. సమానత్వం, సమాన హక్కులు గురించి మాట్లాడే మావోయిస్టులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మావోయిస్టుల్లో చేరిన మహిళలపైనా ఆగడాలు అన్నీఇన్నీ కావని విమర్శించారు. చిన్న పిల్లలను పార్టీలో చేర్పించుకొని పనులు చేయించుకొంటున్నారని ఆక్షేపించారు. ఛత్తీస్గఢ్తో పోలిస్తే తెలంగాణలో జరిగిన అభివృద్ధిని మావోయిస్టుల కుటుంబ సభ్యులు చూడాలన్నారు. ఆపరేషన్ చేయూతతో నలుగురు దళ సభ్యులు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారు పునరావాసంతో పాటు నూతన జీవితాన్ని ఆస్వాదించొచ్చన్నారు. ఓఎస్డీ సాయి మనోహర్ మాట్లాడుతూ ఇటీవల అరెస్టయిన వారి స్థితిగతులు, లొంగిపోయినవారి పునరావాస పరిస్థితులను వివరించారు.
నలుగురు దళ సభ్యులు లొంగుబాటు..
పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూతలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్రాజు ఎదుట నలుగురు దళ సభ్యులు లొంగిపోయారు. చర్ల మండలం బూరుగుపాడుకు చెందిన వంజం దేవ, కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపెల్లి రాజ్కుమార్ అలియాస్ రంజిత్, ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా తిమ్మాపూర్కు చెందిన సోడి గంగా అలియాస్ అశోక్, డోకుపాడు(సుక్మా జిల్లా)కు చెందిన కల్మ దేవ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇటీవల లొంగిపోయిన ముగ్గురు దళ సభ్యులకు ఈ సందర్భంగా ఎస్పీ, ఓఎస్డీ, ఏఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారుల చేతుల మీదుగా చెక్లను పంపిణీ చేశారు. చర్ల మండలం ఎర్రంపాడుకు చెందిన ఏసీఎం క్యాడర్ మడవి కృష్ణకు రూ.4లక్షలు, గుండాల మండలం అడవిరామవరవరానికి చెందిన పూనెం అడమయ్య, సుక్మా జిల్లా పెంటపాడుకు చెందిన వెట్టి బీమాకు రూ.లక్ష చొప్పున రివార్డు సొమ్ములను అందించారు.
చర్ల పోలీసుస్టేషన్లో కమాండ్ కంట్రోల్...
చర్లలో రూ.9.50లక్షలతో చేపట్టిన కమాండ్ కంట్రోల్ను ఎస్పీ రోహిత్రాజు ప్రారంభించారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో 54 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చర్ల పోలీసుస్టేషన్కు అనుసంధానించారు. సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ అదనపు కమాండెంట్ సునీల్కుమార్, 141 బెటాలియన్ ఏసీ రాజ్కుమార్, సీఐలు రాజువర్మ, అశోక్, శ్రీనివాస్, ముత్యం రమేశ్, అశోక్రెడ్డి, ఎస్సైలు టీవీఆర్ సూరి, నర్శిరెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల