నడవలేని కాళ్లే జీవనాధారం
పన్నెండేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోవటంతో పెద్ద దిక్కులేని ఆ కుటుంబానికి కొన్నేళ్లపాటు ఆదరువుగా మారింది. మూడేళ్ల క్రితం తల్లి అనారోగ్యం బారినపడటంతో ఇప్పుడా యువతి ఇంటికి పెద్ద దిక్కుగా మారింది.
కుటుంబానికి పెద్దదిక్కుగా దివ్యాంగురాలు జమాల్బీ
కుట్టు పనుల్లో జమాల్బీ, పక్కన తల్లి జీలాన్బీ
కూసుమంచి, న్యూస్టుడే: పన్నెండేళ్ల ప్రాయంలోనే తండ్రిని కోల్పోవటంతో పెద్ద దిక్కులేని ఆ కుటుంబానికి కొన్నేళ్లపాటు ఆదరువుగా మారింది. మూడేళ్ల క్రితం తల్లి అనారోగ్యం బారినపడటంతో ఇప్పుడా యువతి ఇంటికి పెద్ద దిక్కుగా మారింది. ఓ పక్క దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తల్లిని చూసుకుంటూనే, తమ్ముడికి అండగా నిలుస్తోంది. ఇదంతా చేస్తుంది సాధారణ యువతి కాదు.. ఓ దివ్యాంగురాలు. శరీరంలో వైకల్యం బారినపడ్డ కాళ్లే ఇప్పుడామెను, ఆమె కుటుంబాన్ని నడిపిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో శారీరకంగా ఎంత ఇబ్బంది అవుతున్నా పంటిబిగువున భరిస్తోంది.
కూసుమంచి మండలం మారుమూల గ్రామమైన పోచారానికి చెందిన షేక్ హుస్సేన్, జీలాన్బీ దంపతులకు ఇద్దరు సంతానం. హుస్సేన్ గ్రామంలోనే దర్జీ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కుమార్తె జమాల్బీని స్థానిక ప్రాథమిక పాఠశాలో చేర్పించాడు. చేరిన కొన్నాళ్లకే చిన్నారి పోలియో బారినపడింది. నడుం భాగం నుంచి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నిలబడటం కూడా సాధ్యం కాకపోవటంతో తండ్రే భుజాలపై ఎత్తుకుని ఆమెను పాఠశాలలో దింపేవాడు. ఈ నేపథ్యంలో జమాల్బీ అయిదో తరగతిలో ఉండగా తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో తల్లి జీలాన్బీపై కుటుంబ బాధ్యత పడింది. రెక్కాడితేకాని డొక్కాడని జీవితాలు కావటంతో ఆమె కూలీకెళ్లేది. దీంతో స్కూల్కు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో జమాల్బీ చదువుకు ఫుల్స్టాప్ పడింది. టైలరింగ్ రాకున్నా.. తండ్రి చేసిన వృత్తిని క్రమంగా నేర్చుకుంది. కుట్టు పనులు చేస్తూ తల్లికి ఆసరాగా ఉండేది. ఈ నేపథ్యంలో జీలాన్బీ మూడేళ్ల నుంచి మూత్రపిండాల సమస్యతో బాధపడుతోంది. రెండేళ్లుగా ఆమె రెండు కిడ్నీలు పనిచేయటం లేదు. దీంతో ప్రతి వారం మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి వస్తోంది. జీలాన్బీ కుమారుడే ఆటోలో పోచారం నుంచి 35 కిలోమీటర్లు ఖమ్మం తీసుకెళ్లి రక్తశుద్ధి చేయిస్తున్నాడు. ఖర్చు అవుతున్నా ఆ మేరకు ఆదాయం లేకపోవడంతో కుటుంబ పరిస్థితి దీనంగా మారింది.
బాధితులేం కోరుకుంటున్నారు..
జమాల్బీ సాధారణ త్రిచక్ర వాహనం పైకెక్కి కూర్చోలేదు. ఓ చక్క పీటపై కూర్చొని చేతుల సాయంతో దాన్ని లాక్కుంటూ ముందుకు వెళ్తుంది. పీటపై నుంచి తను కుట్టుపనుల కోసం స్టూలు మీద కూర్చోవాల్సి వస్తే చాలా ఇబ్బంది పడుతుంది. మరోపక్క కుట్టు మిషన్లు చాలా పాతవి. ఇంటర్ వరకు చదువుకున్న సోదరుడు జాన్బాబా కూడా కూసుమంచిలో టైలరింగ్ నేర్చుకున్నాడు. వీరిద్దరికీ కొత్త కుట్టుమిషన్లతోపాటు జమాల్బీకి ఆధునిక త్రీవీలర్ సమకూర్చితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దయార్ద్ర హృదయులు ఆదుకోవాల్సిందిగా జమాల్బీ వేడుకుంటోంది. ప్రభుత్వ అధికారులు సాయమందించాలని విన్నవిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అశ్వారావుపేటలో ఏపీ మంత్రులు
[ 27-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి నష్ట పోయిన ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వెళ్తున్న ఏపీ మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు.. -
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు