ఏనోట విన్నా సీతారాముల కల్యాణ ముచ్చట్లే..
అది గంధ పుష్పాక్షతలతో అలంకృతమయ్యే కల్యాణ మండపం. శిల్పకళా సౌందర్యం ఉట్టిపడే వేదికపై సర్వాభరణాలతో సీతారాములవారి దర్శనం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు.
భద్రాచలం, న్యూస్టుడే: అది గంధ పుష్పాక్షతలతో అలంకృతమయ్యే కల్యాణ మండపం. శిల్పకళా సౌందర్యం ఉట్టిపడే వేదికపై సర్వాభరణాలతో సీతారాములవారి దర్శనం గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఏనోట విన్నా బుధవారం జరిగే సీతారాముల కల్యాణ ముచ్చట్లే. భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మానందాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి రాకపై సందిగ్ధం నెలకొంది. తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తీసుకొచ్చే విషయంలోనూ స్పస్టత రావాలి. ఇంత పెద్ద వేడుకపై అయోమయం వీడాలి.
ఏర్పాట్లపై సమీక్ష అవసరం
2.50 లక్షల నుంచి 3 లక్షల లడ్డూలను రెండు ప్రదేశాల్లో తయారుచేస్తున్నారు. ప్రసాదాలు, తలంబ్రాల కౌంటర్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని పనులు కొనసాగిస్తున్నారు. సమాచార కేంద్రాలు భద్రాచలంలోనే కాకుండా కొత్తగూడెం, పాల్వంచ, పర్ణశాల, సారపాకలోనూ ఉంటాయని దేవాదాయశాఖ అధికారులు ప్రకటించారు. విస్తా కాంప్లెక్స్ పక్కన, గోదావరి ఘాట్లో ఉచిత వసతి సదుపాయం కల్పించనున్నారు. ప్రైవేటు లాడ్జీల గదులను అద్దెకు ఇస్తున్నట్లు ప్రచారం లేకుండానే ఆన్లైన్లో ఉంచారు. సామాన్య భక్తులకు ఈ సంగతి తెలియకముందే గదులు బుక్ అయిపోవటం గమనార్హం. భద్రాచలం పట్టణంలో ఎంపిక చేసిన చోట్ల వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇలాంటి వైద్య శిబిరాలను కొత్తగూడెం నుంచి పర్ణశాల వరకు ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. తాగునీటికి కొరత రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్సవాలకు దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో పాటు సీఎస్ శాంతికుమారి హాజరయ్యే అవకాశముందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష అవసరం.
పోస్టల్ ధరలు యథాతథం
- రెండు ముత్యాలు గల తలంబ్రాల ప్యాకెట్ను గతేడాది తరహాలోనే రూ.30కి విక్రయించాలని ఈఓ రమాదేవి నిర్ణయించారు. పోస్టల్శాఖ గతేడాది ఇదే ప్యాకెట్ను దూర ప్రాంత భక్తులకు రూ.150కి చేర్చింది. అంతరాలయ అర్చన చేయించదల్చినవారు రూ.450 చొప్పున చెల్లించారు.
- అర్చన చేయించే భక్తులకు తలంబ్రాల ప్యాకెట్తో పాటు స్వామివారి ప్రసాదంగా జీడిపప్పు, పసుపు, కుంకుమ అందిస్తారు. రామాలయంలో తలంబ్రాల ప్యాకెట్ ధర యథాతథంగా ఉండటంతో పోస్టల్శాఖ కూడా గతేడాది ధరలనే అమలుచేస్తోంది. 2023లో 25వేల పొట్లాలను బట్వాడా చేయగా ఈసారి ధర నిర్ణయంలో జాప్యంతో ఈసంఖ్య తగ్గే ఆస్కారముంది.
- ఆర్టీసీ కార్గో గతేడాది రెండు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ను భక్తుల చెంతకు చేర్చినందుకు రూ.116 చొప్పున తీసుకోగా ఈసారి ధరను రూ.151 చేసింది. రామాలయంలో రూ.30కి అందించే తలంబ్రాల ప్యాకెట్ను రూ.50 చేస్తారన్న అంచనాతో ధర పెంచింది. రెండు లక్షల ప్యాకెట్లను బుకింగ్ చేసే వీలుంది. దీనిద్వారా ఆర్టీసీకి లాభం రావచ్చు కానీ ఆలయానికి నష్టం తప్పదు. ప్రతి ప్యాకెట్ తయారీకి సుమారు రూ.35 ఖర్చవుతుందని అంచనా. రామాలయానికి వచ్చే భక్తులకు పాత ధరకు విక్రయించటం వల్ల వారి ద్వారా హుండీలో కానుకలు సమకూరుతాయి.
- ఆర్టీసీ చేసే ఈ పనిలో లాభాలు దాని సొంతం. అలాంటప్పుడు దేవుణ్ని నష్టపర్చి లక్షల తలంబ్రాల ప్యాకెట్లను ఆర్టీసీకి ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి అందరికీ సమ్మతమైన నిర్ణయం తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల