రాధాబాయి.. నాలుగుసార్లు ఎంపీ
భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు.
గల్లీ నుంచి దిల్లీకి మన్నెం మగువ ప్రతిభ
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో విజయబావుటా ఎగురవేసి మహిళా శక్తిని అప్పట్లోనే చాటిచెప్పారు. అప్పట్లో ప్రధాని ఇందిరగాంధీతో మాట్లాడాలంటే కాకలు తీరిన నాయకులు సైతం జంకేవారట. ఈమె మాత్రం నేరుగా ఇందిరను కలిసి ఈ ప్రాంత సమస్యలు ప్రస్తావించే చనువు పెంచుకుని ఆనాటి రాజకీయాల్లో ఓ సంచలనంగా నిలిచారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి అగ్ర నాయకులతో రాజకీయ పరిచయాలు ఉండేవి. గిరిజనుల సంపూర్ణ వికాసం కోసం ఐటీడీఏల అవసరాన్ని గుర్తించి వీటి ఏర్పాటుకు జాతీయ స్థాయిలో తన వంతు ప్రయత్నం చేశారు. పశ్చిమ జర్మనీ, జకొస్లొవేకియా, బ్రిటన్ వంటి దేశాలలో పర్యటించారు. విదేశీ వ్యవహారాలలో విశేష అనుభవం గడించారు. ఉత్తమ పార్లమెంటేరియన్గానూ గుర్తింపు పొందారు. ఓయూ సెనేట్ సభ్యురాలిగా కొంత కాలం పని చేసిన రాధాబాయి ఆనందరావు ట్రైకార్ అధ్యక్షురాలిగా గిరిజన అభివృద్ధికి పాటుపడ్డారు.
గల్లీ నుంచి దిల్లీకి.. సామాన్య గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె వ్యూహ ప్రతి వ్యూహాలతో దిట్టగా గల్లీ నుంచి దిల్లీ దాకా ఎదిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో 1930లో ఆమె జన్మించారు. వెంకటాపురం ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది. ఇది భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని మండలం. రాజమండ్రిలో ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన రాధాబాయి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారు. హిందీ పండిట్గా జాతీయ భాషపై విశేష ప్రచారం కల్పించారు. 1952లో కొత్తగూడేనికి చెందిన ఆనందరావును వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో వైద్య వృత్తిపై ఆసక్తి పెంచుకుని నర్సింగ్ శిక్షణ పూర్తయ్యాక కుటుంబ నియంత్రణపై గిరిజన గ్రామాల్లో 1957 నుంచి 1966 వరకు ప్రచారం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రత్యేకతను చాటిన భద్రాచలం ఎంపీ స్థానం 2009లో రద్దు కావడంతో ఇది మహబూబాబాద్ ఎంపీ స్థానంలో భాగమైంది.
కేంద్ర మంత్రులుగా ఆ ముగ్గురు
మధిర, న్యూస్టుడే: ఖమ్మం లోక్సభ స్థానానికి 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. పది మంది ఎంపీలుగా పనిచేశారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్కు చెందిన ఎంపీలు కేంద్రంలో మంత్రి పదవులు చేపట్టి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చారు. 1984, 1989లో ఎంపీగా ఎన్నికైన జలగం వెంగళరావు 1986 నుంచి 1989 వరకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరించారు. పీవీ రంగయ్యనాయుడు 1991లో ఎంపీగా ఎన్నికై అప్పటినుంచి 1996 వరకు టెలీ కమ్యూనికేషన్స్, విద్యుత్తు, జల వనరులశాఖ సహాయ మంత్రిగా పదవులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే జిల్లాలో బీఎస్ఎన్ఎల్ సంస్థను పటిష్ఠపరిచి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ల్యాండ్ఫోన్ వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. 1999, 2004లో వరుసగా రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన రేణుకాచౌదరి 2004 నుంచి కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా, 2006 నుంచి 2009 వరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ముగ్గురు 13 ఏళ్లపాటు కేంద్ర మంత్రులుగా జిల్లా ప్రజలకు సేవలందించారు.
ఖమ్మంలో లక్ష్మీకాంతమ్మ హ్యాట్రిక్
ఖమ్మం నగరం, న్యూస్టుడే: ఖమ్మం లోక్సభ స్థానం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచింది తేళ్ల లక్ష్మీకాంతమ్మ ఒక్కరే. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. ఖమ్మం ఎంపీలుగా గెలిచిన మిగతా వారు ఎవరూ హ్యాట్రిక్ సాధించకపోగా కనీసం మూడోసారి అయినా గెలుపొందలేకపోయారు. 1952లో తొలిసారి ఖమ్మం లోక్సభ స్థానంలో ఎన్నికలు జరిగాయి. 1952, 1957లో వరుసగా పీడీఎఫ్ (పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థి టి.బి.విఠల్రావు ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీపై అప్పట్లో నిషేధం ఉన్నందున పీడీఎఫ్ పేరుతో కమ్యూనిస్టులు పోటీ చేశారు. ఆ తర్వాత 1962, 1967, 1971లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తేళ్ల లక్ష్మీకాంతమ్మ వరుసగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి 1957లో ఆమె ఖమ్మం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరసగా మూడుసార్లు ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. 1978లో హైదరాబాద్లోని హిమాయత్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ నుంచి ఖమ్మానికి ఆమె రాజకీయ వలస వచ్చారు.
రీ జలగం కొండలరావు 1977, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. జలగం వెంగళరావు 1984, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. పీవీ రంగయ్య నాయుడు 1991లో, తమ్మినేని వీరభద్రం (సీపీఎం) 1996లో, నాదెండ్ల భాస్కర్రావు 1998లో, రేణుకాచౌదరి 1999, 2004లో ఎంపీగా విజయం సాధించారు.
రీ నామా నాగేశ్వరరావు 2009లో తెదేపా నుంచి, 2019లో తెరాస నుంచి ఎంపీగా గెలిచారు.
రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైకాపా నుంచి ఎంపీ అయ్యారు.
ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన వారే ఎక్కువగా ఉన్నారు. మూడుసార్లు గెలిచింది తేళ్ల లక్ష్మీకాంతమ్మ ఒక్కరే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్