భూతాపం.. మనుగడకు శాపం
విచ్చలవిడిగా చెట్లు నరికివేయడం, వాహనాల, పారిశ్రామిక కాలుష్యం, మొక్కలు నాటకపోవడం వంటి కారణాలతో రోజురోజుకీ భూతాపం పెరుగుతోంది.
విచ్చలవిడిగా చెట్లు నరికివేయడం, వాహనాల, పారిశ్రామిక కాలుష్యం, మొక్కలు నాటకపోవడం వంటి కారణాలతో రోజురోజుకీ భూతాపం పెరుగుతోంది. ఎండలు మండుతున్నాయి. ఏసీలు, కూలర్లు లేనిదే ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఎండలు 45 డిగ్రీలు దాటి 50 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. ఇలాగే కొనసాగితే మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికైనా మేల్కొని భూతాపాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం...
ఖమ్మం వ్యవసాయం, ఖమ్మం సాంస్కృతికం, న్యూస్టుడే
మొక్కలే జీవనాధారం
వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో మొక్కలది ప్రధాన పాత్ర. వాతావరణంలోకి కార్పన్డైఆక్సైడ్ను గ్రహించి ప్రాణవాయువును ఇస్తాయి. వర్షాలు కురిసేందుకు సహకరిస్తాయి.వాతావరణాన్ని చల్లబరుస్తాయి.
హరితహారం ఇలా..
- ఖమ్మం జిల్లాలో హరితహారంలో భాగంగా 2023 వరకు 70,31,414 మొక్కలు నాటారు. ఈసారి 70.57 లక్షల మొక్కలు నాటటం లక్ష్యంగా పెట్టుకున్నారు.
- భద్రాద్రి జిల్లాలో 2023 వరకు 67,52,453 నాటారు. ఈ ఏడాది 65.738 లక్షలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం
ప్లాస్టిక్ భూమికి ప్రధాన శత్రువు. ఇది భూమిలో కలిసిపోవడానికి ఏళ్లు పడుతుంది. ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలు చేస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. భావితరాల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ప్యాక్టరీలను మూసేయాలి. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేయాలి. అవగాహన పెరగాలి.
ఎర్త్ డే అంటే...
1969లో అమెరికా సెనెటర్ గెలార్డ్ నెల్సన్ ఆలోచనకు ప్రతి రూపమే ఎర్త్ డే. పర్యావరణానికి హాని కలిగించే, భూగ్రహం నాశనానికి దారితీసే కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, అటవీ నిర్మూలన వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా 1970 నుంచి ఏప్రిల్ 22న ఎర్త్డే నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించటమే ప్రధానోద్దేశం. ఈ ఏడాది నినాదం ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్’. ఈ ఏడాది ఆతిథ్య దేశం సౌదీ అరేబియా.
బాబోయ్ ఎండలు
ఏటా ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. 50 డిగ్రీలకు దరిదాపులకు ఉష్ణోగ్రతలు చేరువవుతున్నాయి. ఆదివారం ముదిగొండ మండలం పమ్మిలో 44.9 డిగ్రీలు, నేలకొండపల్లిలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్లోనే ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. వచ్చే నెలాఖరు వరకు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
కాలుష్యానికి కారణాలు...
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు పచ్చటి అందాలతో అలరారింది. నేడు భారీ పరిశ్రమలు, గనులు, కర్మాగారాలు, గ్రానైట్, బైరైటీస్ ఇండస్ట్రీలు, పార్బాయిల్డ్ మిల్లులు, ఇటుక బట్టీలు, చేపల చెరువులు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తోంది. వాహనాలు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, టవర్లు పెరిగాయి. అభివృద్ధికి ఇవి అవసరమే అయినా ఆ మేరకు అడవులు వృద్ధి చెందలేదు. వ్యవసాయంలో మితిమీరిన రసాయనాలు, ఎరువుల వినియోగం పెరిగింది. అడవుల నిర్మూలన, పోడు వ్యవసాయం చేపట్టారు.
అటవీ విస్తీర్ణం
రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో అడవులు కలిగిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. 4.31 లక్షల హెక్టార్లలో అడవులు వ్యాపించి ఉన్నాయి.
పోడు వ్యవసాయం: 26,688 ఎకరాలు
ఖమ్మం జిల్లాలో..
అటవీ విస్తీర్ణం 63,941.9 హెక్టార్లు (14.66 శాతం)
ప్లాస్టిక్ నివారణకు కట్టుబడదాం
ప్లాస్టిక్ వినియోగం వల్ల ధరిత్రి స్వచ్ఛతను కోల్పోతోంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్ను వాడుతున్నారు. దీన్ని నియంత్రించాలి. ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అధికారులు అవగాహన కల్పించాలి. మొక్కలను విరివిరిగా పెంచడం వల్లనే భూమిని కాపాడుకోగలం. వాతావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ప్రతీ ఒక్కరూ ధరిత్రి రక్షణ తమ బాధ్యతగా వ్యవహరించాలి.
కడవెండి వేణుగోపాల్, పర్యావరణ మిత్ర జాతీయ పురస్కార గ్రహీత
మొక్కలు నాటండి
మనకోసం, భవిష్యత్తు తరాల కోసం మొక్కలు నాటాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు ఇలా ప్రతి ముఖ్యమైన రోజు మొక్కలు నాటించాలి. సొంత నీటి సీసా, కిరాణా సంచి వెంట తీసుకెళ్తే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చు. ముద్రణను తగ్గించి, చెట్లను కొట్టివేయకుండా చూడాలి. దగ్గరి దూరాలకు మోటారు వాహనాలు వాడకపోవడం మంచిది.
పెసర ప్రభాకర్రెడ్డి, తెలంగాణ జీవశాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి