విహరించు.. విజ్ఞానం సముపార్జించు..!
ప్రభుత్వ విద్యాలయాలను ఆధునిక పరిశోధనలు, విజ్ఞాన నిలయంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం ‘ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకాన్ని రెండేళ్లుగా అమలు చేస్తోంది.
పాల్వంచ, న్యూస్టుడే
పాకాల చెరువు సందర్శనలో పాల్వంచ కేటీపీఎస్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు
ప్రభుత్వ విద్యాలయాలను ఆధునిక పరిశోధనలు, విజ్ఞాన నిలయంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం ‘ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకాన్ని రెండేళ్లుగా అమలు చేస్తోంది. ఎంపికైన పాఠశాలల్లో గుణాత్మక బోధన, అభ్యాసం, సమగ్రాభివృద్ధే పథకం లక్ష్యం. ఇందులో భాగంగా నూతన ఆవిష్కరణల రూపకల్పనకు విద్యార్థులను ప్రోత్సహిస్తారు. క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా విజ్ఞాన, విహార యాత్రలు ఏటా నిర్వహిస్తారు. స్థానిక పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగానూ పిల్లల్లో నిర్మాణాత్మక పురోగతికి బాటలుపరుస్తారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి లక్షిత కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే నిధులు అందాయి.
ఉభయ జిల్లాల్లో..
ఖమ్మం జిల్లాలో 22, భద్రాద్రి జిల్లాలో 20 పాఠశాలలు పీఎంశ్రీ పథకానికి ఎంపికయ్యాయి. వీటిలో చాలాచోట్ల నిర్వాహకులు ఇటీవలే విజ్ఞాన, విహార యాత్రలు నిర్వహించారు. మిగతావారు ఈనెలాఖరులోగా యాత్రలు పూర్తిచేయనున్నారు. ఇప్పటివరకు ప్రయోగశాలల స్థాయిలో నూతన వైజ్ఞానిక నమూనాలు రూపొందించిన విద్యార్థులు.. ఇప్పుడు హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని పారిశ్రామిక, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు వెళ్లొస్తున్నారు. చారిత్రక, నైపుణ్య, విజ్ఞాన సంబంధ అంశాలపై అవగాహన పెంపొందించుకుంటున్నారు. ఆరు నుంచి తొమ్మిదోతరగతి విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నిధులను కేంద్రం విడుదల చేసింది. ‘విజ్ఞాన యాత్రలతో విద్యార్థుల్లో కొత్త విషయాలపై ఆసక్తి పెంపొందుతోంది. దీన్ని అందిపుచ్చుకుని తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో వీలైతే పిల్లలకు విజ్ఞానాన్ని పంచే పర్యటనలకు ప్రాధాన్యమివ్వాలి. వచ్చే ఏడాదీ కార్యక్రమాల విజయవంతానికి కృషిచేస్తాం’ అని పాల్వంచ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమ ‘న్యూస్టుడే’కు తెలిపారు.
చదువుకున్న చరిత్ర.. కళ్లెదుటే ప్రత్యక్షం!
అజ్ర, 9వ తరగతి, కేటీపీఎస్ బాలికోన్నత పాఠశాల, పాల్వంచ
ఈ నెల 10న వరంగల్ జిల్లా విహారయాత్ర ప్రారంభించారు. కాకతీయుల చరిత్రపై అధ్యయనంలో భాగంగా వరంగల్ కోట, పాకాల చెరువు, వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయాలను సందర్శించాం. పాఠశాలల్లో చదివిన అంశాలను నేరుగా చూడటం విశేషంగా అనిపించింది. అలనాటి రాజరిక పాలన, చారిత్రక, సాంఘిక పరిస్థితులపై అవగాహన కల్పించడం మరిచిపోలేను అనుభూతిని కలిగించింది.
ఖగోళ, విజ్ఞాన శాస్త్రాలపై అవగాహన
హేమ వెంకట సహిత, 8వ తరగతి.
నేను ములకలపల్లి మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో చదువుకుంటున్నాను. ఈనెల 4న హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియాన్ని తిలకించాం. ఖగోళ, విజ్ఞాన శాస్త్రాలపై అవగాహన పెంపొందింది. స్థానికంగానూ పాల్వంచ నవభారత్ సంస్థ, తోగ్గూడెంలో ‘మిషన్ భగీరథ’ ప్రాజెక్టు, కిన్నెరసాని జలాశయం, వన్యప్రాణి అభయారణ్యాన్ని సందర్శించడం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ