ఉల్లంఘనులకు తప్పదు భారీ మూల్యం
లోక్సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఓ దినపత్రికలో రాజకీయ ప్రకటన ఇచ్చినందుకు టీఎన్జీఓ (తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్) సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
లోక్సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఓ దినపత్రికలో రాజకీయ ప్రకటన ఇచ్చినందుకు టీఎన్జీఓ (తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్) సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, జూనియర్ అసిస్టెంట్ ఎస్కే అఫ్జల్ హాసన్, సంఘం కార్యదర్శి, మెడికల్ సూపరింటెండెంట్ సాగర్పై కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) ఇటీవల సస్పెన్షన్ వేటు వేశారు.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం
లోక్సభ ఎన్నికల నిర్వహణపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, ముఖ్యనేతలు సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఈ తరుణంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సస్పెన్షన్ వేటు పడుతుందని గుర్తుంచుకోవాలి. తద్వారా భవిష్యత్తులో ఉద్యోగోన్నతులు, ఇంక్రిమెంట్లపైనా ప్రభావం పడే అవకాశముంటుంది.
హద్దు మీరితే అంతే సంగతులు
సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఉద్యోగులు ఈసీ పరిధిలో పనిచేయాలి. ప్రభుత్వ, కార్పొరేషన్, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే అన్ని కేటగిరీల ఉద్యోగులు తమ విధులకు పరిమితమవ్వాలి తప్ప ఏ రాజకీయ పార్టీలకు కొమ్ముకాయొద్దని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా వారిపై నిరంతరం నిఘాతో పాటు ఫేస్బుక్, వాట్సాప్ పోస్టులపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఉద్యోగులు వివిధ రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా వ్యవహరించే సన్నివేశాన్ని దృశ్యరూపకం లేదా శ్రవణరూపకం ద్వారా ఎవరైనా చిత్రీకరించి ఎన్నికల సంఘానికి పంపించినా, ప్రచార మాధ్యమాల్లో పోస్టు చేసినా సదరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు తప్పదనేది ఇటీవల జరిగిన ఉదంతాలు చాటిచెబుతున్నాయి.
నిఘా నేత్రం చూస్తోంది
ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వీడియో సర్వైలెన్స్, స్టాటిస్టికల్ సర్వైలెన్స్ బృందాల ఎంపిక ప్రక్రియను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. అభ్యర్థుల సభలు, సమావేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా వాటిలో పాల్గొన్నట్లు తెలిసినా, ఫిర్యాదులు అందినా సంజాయిషీ నోటీసులు జారీ చేస్తారు. ఉల్లంఘించినట్లు తేలితే సస్పెన్షన్ వేటు వేస్తారు.
ఇవి చేస్తే కఠిన చర్యలే..
- ప్రభుత్వ ఉద్యోగులు ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేసినా ఈసీ చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందే.
- రాజకీయ పార్టీల కండువాలు వేసుకుని ప్రచారం చేయటం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం తగదు.
- పార్టీల ప్రచార సభల్లో పాల్గొనటం, తమకు సంబంధించిన అభ్యర్థేనని ప్రచారం చేయటాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది.
- ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా ఒక అభ్యర్థికి సహకరిస్తున్నారనే చిన్నపాటి ఆధారాలు దొరికినా వేటు పడుతుంది.
- తన కిందిస్థాయి ఉద్యోగి లేదా సిబ్బందిని అధికార దర్పంతో ఒక పార్టీకి సహకరించాలని, ఫలానా అభ్యర్థికే ఓటేయాలని చెప్పటమూ తప్పే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్