సీతారామ.. ఆమోదం పొందేనా?
గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో 2016, ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు.
టేకులపల్లి, ఇల్లెందు, న్యూస్టుడే
గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో 2016, ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. తొలుత ఫేజ్-1, ఫేజ్-2గా డిజైన్లు రూపొందించినా సర్వే సమయంలోనే కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం, రిజర్వ్ ఫారెస్ట్, రైల్వే ట్రాక్లు, టన్నెల్స్ నిర్మాణం చేపట్టాల్సి రావటంతో అటవీ అనుమతులు జాప్యమవుతాయనే కారణంతో ఫేజ్-1ను అధికారులు రద్దు చేశారు. తద్వారా రోళ్లపాడు రిజర్వాయర్కు మాత్రమే కాదు ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలకు సీతారామ ద్వారా చుక్కనీరందని పరిస్థితి నెలకొంది.
నీటి పంపిణీ ఇలా..
తాళ్లగూడెం, గాదేపాడు, రాఘబోయినగూడెం, బేతంపూడి, చల్లసముద్రం, గార్ల వద్ద ఆరు పంప్హౌజ్లు నిర్మించనున్నారు. వీటికి అనుగుణంగా నీళ్లను ఎత్తిపోతలు, పైప్లైన్లు, కాల్వల ద్వారా పంపింగ్ చేయనున్నారు. ప్రాజెక్టు ప్రధాన కాల్వ పొడవు 104 కిలోమీటర్లు కాగా ఈ చివరన పాలేరు లింక్ కెనాల్ జూలూరుపాడు- చీమలపాడు గుట్టల మధ్యలో మొదలవుతుంది. 24.075 కి.మీ. వద్ద కామేపల్లి మండలం తాళ్లగూడెం సమీపంలో పంప్హౌజ్ నిర్మించి ఇల్లెందుకు కలపనున్నారు. అక్కడి నుంచి 60 మీటర్ల ఎత్తులో (డెలివరీ సిస్టమ్) కోమట్లగూడెం వరకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లను ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి గాదేపాడు(కుడి), గార్ల (ఎడమ) వైపు వెళ్లే గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి.
ఎడమ వైపు..
కోమట్లగూడెం - గార్ల కాల్వ ద్వారా చల్లసముద్రం, లచ్చగూడెం వరకు 39 మీటర్ల ఎత్తు నుంచి ఎత్తిపోస్తారు. ఇక్కడి నుంచి గార్ల చెరువుకు, అనంతరం 59 మీటర్ల ఎత్తు నుంచి బయ్యారం పెద్ద చెరువుకు పంప్ చేయనున్నారు.
- నాటి ఎమ్మెల్యేలు ప్రాజెక్ట్ ద్వారా ఇల్లెందుకు నీరందించాలని, అదనపు ఆయకట్టును స్థిరీకరించాలని ప్రభుత్వానికి నివేదించటంతో డిజైన్లు మారాయి. ఫేజ్-2 ద్వారా 12 మండలాల్లోని 76 గ్రామాల్లో అదనపు ఆయకట్టు కోసం గోదావరి జలాలు తీసుకొచ్చేలారీడిజైన్ చేశారు.
- డీపీఆర్ను సాగునీటిశాఖ ఇంజినీరింగ్ విభాగం ఇటీవల కేంద్ర జలవనరుల సంఘానికి అందించింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం దృష్టి సారిస్తే డీపీఆర్ ఆమోదం, పనులు త్వరితగతిన పూర్తయ్యే అవకాశముంది.
కుడి వైపు..
కోమట్లగూడెం గ్రావిటీ కెనాల్ ద్వారా గాదేపాడు చెరువు నింపుతారు. తర్వాత పంప్హౌజ్ పెట్టి 38 మీటర్ల ఎత్తు నుంచి రాఘబోయినగూడేనికి ఎత్తిపోస్తారు. రాఘబోయినగూడెం చెరువు వద్ద రెండు పాయలుగా విడగొట్టి ఒకదాన్ని రోళ్లపాడు, కొమరారం వైపు మళ్లిస్తారు. కొమరారం చెరువులో 150 మీటర్ల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోస్తారు. రోళ్లపాడుకు 29 మీటర్ల ఎత్తు నుంచి లిఫ్ట్ చేస్తారు. రోళ్లపాడు ఎడమ కాల్వ నుంచి బోడుకు 64 మీటర్ల ఎత్తు నుంచి ఎత్తిపోస్తారు.
మూడు జిల్లాలు.. ఆరు నియోజకవర్గాల్లో
సీతారామ ప్రాజెక్ట్ మొదటి డీపీఆర్ను 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు రూపకల్పన చేశారు. మారిన ప్రణాళికతో ఆయకట్టు సామర్థ్యం 7.84 లక్షల ఎకరాలకు చేరింది. భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, వైరా, ఖమ్మం, డోర్నకల్ నియోజకవర్గాల్లో ఆయకట్టు విస్తరించనుంది. ఇల్లెందు నియోజకవర్గం పరిధిలో 65 వేల ఎకరాలకు సాగునీరందనుంది. వైరాలో 25 వేల ఎకరాలకు, కొత్తగూడెంలో 500 ఎకరాలు, డోర్నకల్లో 263 ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జిలాలు పారనున్నాయి.
కేంద్ర జలవనరుల శాఖకు డీపీఆర్ సమర్పించాం. ఫైనాన్స్ స్టేజీలో ఉంది. తరువాత టెక్నికల్ అడ్వజయిరీ కమిటీకి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తమ్మీద ఆమోదానికి సుమారు మూడు నెలలు సమయం పట్టొచ్చు.
శ్రీనివాసరెడ్డి, సీఈ, భద్రాద్రి కొత్తగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి