కోల్ ప్లాంట్ కింగ్
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు.
ఓ విభాగాధిపతి వేధింపులు, అవకతవకలపై కేటీపీఎస్ ఉద్యోగుల ఆవేదన
పాల్వంచ, న్యూస్టుడే: కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. విధుల్లో తమపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులకు ఇటీవల ఓ ఫిర్యాదు సైతం అందింది. ఈ విషయాన్ని పలు సంఘాల నాయకులూ తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోల్ ప్లాంట్లో ఆర్టిజన్ స్థాయి నుంచి సూపరింటెండెంట్ ఇంజినీర్ వరకు సుమారు వెయ్యి మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 5, 6వ దశ కర్మాగారాల్లో విద్యుదుత్పత్తికి ప్రధానంగా కావాల్సిన బొగ్గు ఇక్కడ్నుంచే అందుతుంది. పలు స్థాయుల్లో డివిజన్లోని ఎస్ఈ, నలుగురు డీఈలు, ఏడీఈ, ఏఈ, ఏఈఈ, ఇతర ఉద్యోగులు ప్రధానపాత్ర పోషిస్తారు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఆపరేషన్, ఫ్యూయల్ నిర్వహణ విభాగాల డీఈలపై ఎస్ఈ, సీఈ స్థాయి ఉన్నతాధికారి నియంత్రణ ఉంటుంది. కానీ, ఆ అధికారుల తర్వాతి స్థానంలో ఉండే డీఈ స్థాయి అధికారి చెప్పిందే శాసనమని, లేదంటే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఇటీవల పలువురు ఉద్యోగులు ఆరోపించారు. పైస్థాయి అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఇదేమిటని నిలదీసే ఇంజినీర్లను అదును చూసి బదిలీ చేయడమో, విభాగాలు మార్చడమే చేస్తున్నారని సమాచారం. ప్లాంట్లో ఏదైనా ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. కార్యాలయ పనివేళలు, క్షేత్రస్థాయి తనిఖీలు పట్టించుకోరు. స్మార్ట్ఫోన్ గంటల పాటు వాడతారనే విమర్శలున్నాయి. విద్యుత్తు కర్మాగారాల్లో, ముఖ్యంగా పనిప్రదేశాల్లో ధూమపానం నిషేధం. ఈ నిబంధనను ఆయన అస్సలు పట్టించుకోరు.
కీలక విభాగం.. రూ.కోట్లల్లో కొనుగోళ్లు!
కోల్ప్లాంట్లో తాను పనిచేసే ముఖ్య విభాగానికి ఏది కావాలన్నా సదరు డీఈనే సిఫార్సు చేస్తుంటారు. రూ.కోట్ల విలువైన సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా తనకు అనుకూలమైన ఏజెన్సీల వద్దే సామగ్రి కొనుగోలు చేసేలా చూడటం ద్వారా పర్సంటేజీలు తీసుకుంటున్నట్లు కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పైఅధికారి ప్రవర్తన, ఆరోపణల నిగ్గుతేల్చాలని కర్మాగారం చీఫ్ ఇంజినీర్, సీఎండీ, ఉద్యోగ సంఘాలకు ఓ ఉద్యోగి ఆన్లైన్లో లేఖ పంపారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.
ఒకేచోట.. ఏళ్లుగా పాతుకుపోయి!
సదరు డీఈది ఎలక్ట్రికల్ విభాగం. కానీ కొన్నేళ్లుగా వేరే విభాగం అగ్రస్థానంలో పనిచేస్తున్నారు. అక్కడి విభాగంలో అర్హులైన వేరే డీఈలున్నప్పటికీ ఆయన స్థానం కొన్నేళ్లుగా పదిలంగా ఉండటం ఆశ్చర్యకరం. ఏడీఈ నుంచి పదోన్నతులు పొందుతూ డీఈ స్థాయికి చేరిన ఆ అధికారి, ఒకే పని ప్రదేశంలో సుమారు రెండు దశాబ్దాలుగా బదిలీల్లేకుండా కొనసాగుతుండటం గమనార్హం. ఈయన కారణంగా అర్హులైన అధికారులకు అన్యాయం జరుగుతోందన్న వాదన వ్యక్తమవుతోంది. చెప్పింది వినకుంటే ఎక్కడ బదిలీల చేయిస్తాడోనని కిందిస్థాయి ఉద్యోగులు కిమ్మనకుండా ఉంటున్నారు.
కోల్ప్లాంట్లో ఓ అధికారిపై వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తా. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తా. ఎవరైనా ఉద్యోగులు ఇబ్బంది పడితే నా దృష్టికి తీసుకురావచ్చు. కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని వెంటనే పరిశీలిస్తున్నాం. విధుల్లో ఏ స్థాయి అధికారి అనుచితంగా ప్రవర్తించినా, ఎదుర్కొనే ఆరోపణలు నిజమని తేలినా చర్యలు తప్పవు.
మేక ప్రభాకర్రావు, చీఫ్ ఇంజినీర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు