అడుగడుగునా అడ్డంకులే..
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి.
కదలని అనుసంధానం పనులు
హిమాంనగర్లో సర్వే అడ్డుకునేందుకు వచ్చిన రైతులు (పాత చిత్రం)
ఏన్కూరు, న్యూస్టుడే: సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. మార్చి 13న వైరాలో నలుగురు మంత్రులు ఈ పనులకు శంకుస్థాపన చేసిన విషయం విదితమే. తమకు కచ్చితమైన హామీలు ఇవ్వడం లేదని భూములు కోల్పోతున్న రైతులు అడ్డుకోవడంతో పనులకు ఆలస్యం జరుగుతుంది. కాలువ తవ్వకాలలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉండటంతో తమకున్న జీవనాధారం కోల్పోతున్నామని, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబడుతున్నారు. మరోవైపు ఎకరానికి కచ్చితమైన పరిహారం ప్రకటించకుండానే సర్వేలు చేపట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూములిచ్చేందుకు నిరాకరణ..
జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఏన్కూరులోని ఎన్నెస్పీ ఎడమ కాలువలోకి మళ్లించేందుకు లింక్ కెనాల్ నిర్మాణం చేపడుతున్నారు. ఏన్కూరు, హిమాంనగర్, నాచారం, టీఎల్పేట రెవెన్యూ గ్రామాల నుంచి 106.20 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభలు, అభిప్రాయాల సేకరణ చేపట్టగా ఆ గ్రామాల రైతులు నిరాకరిస్తూ తమ భూములు ఇవ్వబోమంటూ తేల్చిచెప్పారు. కాలువ వల్ల తమకు లాభం లేదని, ఏళ్లుగా ఉన్న విలువైన భూములు కోల్పోతున్నామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం చాలా తక్కువని, తిరిగి భూమి కొనాలంటే కష్టమని తెలిపారు. ఎలాంటి ప్రకటన చేయకుండానే కొన్నిరోజులుగా పొలాల్లో యంత్రాలు దింపడంతో అడ్డుకుంటున్నారు.
మా గోడు పట్టించుకోరా..
ఏన్కూరు నుంచి హిమాంనగర్ వరకు అధికారులు సర్వే చేపడుతుండగా రైతులు అడ్డుకుంటున్నారు. కొంతమంది రైతులు తమకున్న భూమి మొత్తం కాలువకు పోతుందని తామెలా బతకాలంటూ అధికారుల ఎదుట ఆవేదన చెందుతున్నారు. భూముల్లోని బోర్లు, మోటర్లు పోతున్నాయని మరికొందరు చెబుతున్నారు. సుమారు వారం క్రితం హిమాంనగర్లో రైతులు మూకుమ్మడిగా సర్వేను అడ్డుకోవడంతో ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ శేషగిరిరావు అక్కడికి చేరుకున్నారు. సర్వేకు సహకరించాలని కోరగా పరిహారం ప్రకటించకుండా సర్వే ఎలా చేస్తారని రైతులు ప్రశ్నించారు. ఏన్కూరులో 1970కు పూర్వం నుంచి ఉన్న భూములకు పట్టాలుండగా వారికి రైతుబంధు సాయం అందుతుంది. భూములు కోల్పోయి తిరిగి కొనుగోలు చేస్తే గిరిజనేతురులకు పట్టాలు చేసే అవకాశం ఉండదని వాటిపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కలెక్టర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని, అప్పటివరకు తాము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం