ప్రచార తీరు.. మారింది గురూ..!
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు.
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. ఇప్పుడు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అడపాదడపా ర్యాలీలు, కార్యకర్తల సమావేశాలకే అభ్యర్థులు, ముఖ్యనేతలు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో ఉదయం పూట వాకర్స్ను కలిసి కాసేపు ముచ్చటిస్తున్నారు. అపార్ట్మెంట్లు, సామాజికవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించే బాధ్యతలను స్థానిక నాయకులు భుజానికెత్తుకుంటున్నారు.
కానరాని హంగూ ఆర్భాటాలు
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో హంగూ ఆర్భాటాలు కనిపించటం లేదు. పోలింగ్కు సుమారు 20 రోజుల వ్యవధే ఉన్నా కనీసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయట్లేదు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మండల నాయకులు సైతం పెద్దగా కాలు కదిపేందుకు అయిష్టత చూపుతున్నారు. ఎన్నికలపై గ్రామాలు, పట్టణాల్లో రచ్చబండ చర్చలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి.
ఆచితూచి అడుగులు
గతంలో పట్టణాలకు అభ్యర్థులు, ముఖ్యనాయకులు వచ్చినప్పుడు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించి బలాన్ని ప్రదర్శించేవారు. ఇందుకోసం రోజువారీ కూలీలను రప్పించేవారు. ప్రచారం అనంతరం వారికి కూలితో పాటు భోజనం, మద్యం వంటివి పంపిణీ చేసేవారు. దీనివల్ల ఖర్చు తడిసిమోపెడయ్యేది. ర్యాలీలో ఎంతమంది పాల్గొన్నారు..? కండువాలు, టోపీలు ధరించనవారెందరు..? ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలు ఎన్ని ఉన్నాయి..? వాటి ఇంధనం ఖర్చు తదితరాలను ఎన్నికల అధికారులు లెక్కిస్తుండటంతో వ్యయ పరిమితి దాటుతుందనే భయంతో అభ్యర్థులు వీటికి ఆసక్తి కనబరచటం లేదు. కేవలం నామపత్రాల దాఖలు సమయంలో మాత్రమే పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతున్నారు.
ఓటర్లకు చేరవయ్యేందుకు..
ప్రధాన పార్టీల అభ్యర్థులు స్మార్ట్ ప్రచారంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. వాట్సప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకు చేరవయ్యేందుకు యత్నిస్తున్నారు. సంక్షిప్త సందేశాలు, వాయిస్ కాల్స్పై ఆధారపడుతున్నారు. ప్రముఖ దినపత్రికల్లో ఆకట్టుకునే నినాదాల ప్రకటనలతో ఓటర్ల మదిని గెలుచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అశ్వారావుపేటలో ఏపీ మంత్రులు
[ 27-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి నష్ట పోయిన ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వెళ్తున్న ఏపీ మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు.. -
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు