అయిదో రోజూ నామినేషన్ల సందడి
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు.
ఖమ్మం: రఘురామిరెడ్డి తరఫున నామపత్రాలు అందిస్తున్న బొర్రా రాజశేఖర్, స్వర్ణకుమారి, నిరంజన్రెడ్డి, రాంబాబు
ఖమ్మం నగరం, న్యూస్టుడే: ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు రెండు సెట్ల నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు. మార్క్ఫెడ్ మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజేశేఖర్, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, డాక్టర్ కోట రాంబాబు, ధరావత్ రామ్మూర్తినాయక్, ముదిరెడ్డి నిరంజన్రెడ్డి ఒక సెట్ నామపత్రాలు సమర్పించారు. రఘురామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బొర్రా రాజశేఖర్ ప్రతిపాదించారు. రఘురామిరెడ్డి పేరిట నూకల నరేశ్రెడ్డి, ముస్తఫా, జగన్, జొన్నలగడ్డ రవి, స్వామి రమేశ్ మరో సెట్ నామపత్రాలు అందించారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్కు చేరుకుని నామపత్రాలు దాఖలు చేసి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించకపోవటం గమనార్హం.
- భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు తరఫున రెండు సెట్ల నామపత్రాలను ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, గెంటేల విద్యాసాగర్, సుగ్గల వెంకటేశ్వరరావు గుప్తా అందించారు.
- రయీస్ అన్వర్ (సోషలిస్ట్ పార్టీ)-1, కె.నాగేశ్వరరావు (స్వతంత్ర)- 1, ఏవీజే ప్రసాద్ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా)- 1, అవుటపల్లి రామలింగేశ్వరరావు (స్వతంత్ర)- 1, కాశిమళ్ల నాగేశ్వరరావు (స్వతంత్ర)-1 షేక్ సిరాజుద్దీన్ (స్వతంత్ర) అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్లు వేశారు.
మహబూబాబాద్, న్యూస్టుడే: మహబూబాబాద్ లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థి మాలోత్ కవిత ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ములుగు జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతితో కలిసి ఆర్ఓ అద్వైత్కుమార్సింగ్కు నామపత్రాలు అందజేశారు. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు, పినపాక, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్నాయక్, డీఎస్ రెడ్యానాయక్, హరిప్రియ, పెద్ది సుదర్శన్రెడ్డి, మహబూబాబాద్ జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు పాల్గొన్నారు.మహబూబాబాద్ లోక్సభ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు మంగళవారం నామపత్రాలు దాఖలు చేశారు. ఆదివాసీ ఐకాస సంఘాల తరఫున మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, స్వతంత్ర అభ్యర్థులు బానోత్ ప్రేమ్లాల్, పోరిక శ్యామల్నాయక్, జాటోత్ రఘువర్మ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణ నామినేషన్లు వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్