హత్య కేసు నిందితుల అరెస్టు
ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
తల్లాడ, న్యూస్టుడే: ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి బావమరిది కె.మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితుల్ని అరెస్టు చేశారు. వైరా సీఐ సాగర్ తెలిపిన ప్రకారం.. గోపాలపేట గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసే పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య కనకదుర్గ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మరణానంతరం తల్లాడకు చెందిన త్రివేణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం త్రివేణిని వెంకటేశ్వర్లు రెండో వివాహం చేసుకున్నాడు. గతేడాది నవంబరు వరకు వీరు తల్లాడలో నివాసం ఉన్నారు. ఆరు నెలల క్రితం ఖమ్మంలోని కరుణగిరి ప్రాంతానికి వెళ్లి అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వెంకటేశ్వర్లు, త్రివేణి తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో గోపాలపేటలో వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ, మొదటి భార్య కూతుళ్లు నీరజ, ఝాన్సీల పేరున ఉన్న ఎకరం పొలం, రెండు పడక గదుల ఇల్లు, ఇంటి స్థలాలను విక్రయించుకుని రావాలంటూ త్రివేణి భర్తను ఒత్తిడి చేసింది. డిసెంబరు నెలలో తల్లి పిచ్చమ్మను వెంకటేశ్వర్లు బెదిరించి ఇల్లు, స్థలాన్ని తన పేరున రాయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె గ్రామపెద్దలకు చెప్పడంతో వారు జోక్యం చేసుకొని వీలునామాను తిరిగి పిచ్చమ్మకు ఇప్పించారు. అప్పటి నుంచి నిందితుడు కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో త్రివేణి ఒత్తిడి మేరకు తన తల్లీకూతుళ్లను చంపాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర్లు ఈ నెల 17న అర్ధరాత్రి ఖమ్మం నుంచి బస్సులో నరసింహారావుపేట గ్రామానికి వచ్చాడు. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ గోపాలపేటలోని తన ఇంటికి వెళ్లి నిద్రలో ఉన్న తల్లి పిచ్చమ్మ, కుమార్తెలు నీరజ, ఝాన్సీలను గొంతు నులిమి చంపాడు. తిరిగి గోపాలపేట నుంచి నడుచుకుంటూ తల్లాడకు చేరుకుని అక్కడి నుంచి ఖమ్మం వెళ్లాడు. పోలీసులు ఆదివారం సాయంత్రం ఖమ్మం నుంచి సత్తుపల్లి వెళ్తుండగా తల్లాడ బస్టాండ్లో వెంకటేశ్వర్లు, త్రివేణిలను అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం ఇద్దరు నిందితులను మధిర కోర్టులో హాజరుపర్చారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
దమ్మపేట, న్యూస్టుడే: గట్టుగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన దుగ్గిరాల సత్యనారాయణ(48) సోమవారం ద్విచక్ర వాహనంపై వచ్చి కూరగాయలు కొనుగోలు చేశారు. తిరిగి వెళ్తుండగా, జాతీయ రహదారిపై సత్తుపల్లి వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాము ఫిర్యాదు మేరకు ఎస్సై సాయికిషోర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎదురు కాల్పుల్లో జవాన్ మృతి
దుమ్ముగూడెం, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఓ జవాను మృతి చెందగా, మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్, ప్రత్యేక పోలీస్ బలగాలు ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దు సునాబేడా అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉదయం 6 గంటల సమయంలో భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టు దళాలు మెరుపుదాడులకు దిగడంతో ఇరువర్గాల మధ్య దాదాపు రెండు గంటల పాటు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ జవాను మృతిచెందగా, మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్టుడే: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఓ గ్రామ కమిటీ ఇన్ఛార్జి భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఈ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో సుకుమా జిల్లాకు చెందిన ఏటూరునాగారం-మహదేవ్పూర్ ఏరియా కమిటీ సభ్యుడు కోవాసి గంగా అలియాస్ మహేశ్ (జనార్దన్), ఆయన భార్య సోడి ఉంగి అలియాస్ ఝాన్సీ, డీఏకేఎంఎస్ ఇన్ఛార్జి కలుమ బుద్ర ఉన్నట్లు తెలిపారు. గంగా 2009లో ఏరియా కమిటీలో మిలీషియా సభ్యుడిగా చేరాడు. 2015లో ఏసీఎంగా పదోన్నతి పొందాడు. మరో మహిళ ఉంగి 2019లో అదే ఏరియా కమిటీలో దళ సభ్యురాలిగా చేరింది. ఆ తర్వాత గంగాను వివాహం చేసుకుంది. ప్రస్తుత మావోయిస్టు విధానాలు నచ్చకపోవడంతో జనజీవన స్రవంతిలో కలవాలని గంగా, ఉంగి దంపతులు నిర్ణయించుకున్నారని ఎస్పీ వివరించారు. మరోవ్యక్తి బుద్ర 2002లో చిన్న వయస్సులోనే మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా చేరాడు. ఏడాది తర్వాత చైతన్య నాట్య మండలి (సీఎన్ఎం)లో పదేళ్లు కళాకారుడు, గాయకుడిగా పనిచేశాడు. ప్రస్తుతం పుట్టపాడు గ్రామం డీఏకేఎంఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. మావోయిస్టులు ఆదివాసీ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారని ఎస్పీ అన్నారు. ప్రస్తుతం వారి కార్యకలాపాలు ఛత్తీస్గఢ్కు పరిమితమైనట్లు చెప్పారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు, బలవంతపు వసూళ్లు, ఏజెన్సీలో అభివృద్ధి అడ్డగింత వంటి చర్యలు ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. పార్టీ నాయకుల వేధింపులు భరించలేక చాలామంది దళ సభ్యులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పోలీసు శాఖ అమలు చేస్తున్న ‘ఆపరేషన్ చేయూత’లో కౌన్సెలింగ్కి హాజరవుతున్న కుటుంబ సభ్యులు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న తమ వారిని బయటకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సాధారణ జీవనం గడపాలనుకునే దళ సభ్యులు తమ కుటుంబ సభ్యుల ద్వారా, లేకపోతే స్వయంగా వచ్చి తమ వద్ద లొంగిపోవచ్చన్నారు. వారికి జీవనోపాధి, పునరావాసం కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కృషిచేస్తుందన్నారు. భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ కమల్వీర్యాదవ్, 81 బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ కన్హార్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై టీవీఆర్ సూరి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
[ 27-07-2024]
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కట్ట శేఖర్ డిమాండ్ చేశారు. -
పోరాటాల ఫలితమే చేయూత పథకం
[ 27-07-2024]
చేయూత పథకం ద్వారా రూ.4,000 చెల్లించే విధంగా మంత్రి సీతక్క ప్రకటన చేశారని ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు వెంకట నారాయణ పేర్కొన్నారు. -
అశ్వారావుపేటలో ఏపీ మంత్రులు
[ 27-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి నష్ట పోయిన ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వెళ్తున్న ఏపీ మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు.. -
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు