logo

ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం

ప్రజా ఉద్యమాలతోనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య అన్నారు.

Published : 21 May 2024 02:38 IST

ఏన్కూరు, న్యూస్‌టుడే: ప్రజా ఉద్యమాలతోనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య అన్నారు. సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి పార్లమెంట్‌ ఎన్నికల సమీక్ష సమావేశాన్ని ఏన్కూరు మండలం లచ్చగూడెంలో సోమవారం నిర్వహించారు. ఎర్రయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ముఖ్యం కాదని, నిరంకుశ పాలకుల విధానాలను గ్రామగ్రామాన ఎండగట్టడమే తమ లక్ష్యమన్నారు. అభివృద్ధి నిరోధక, విదేశాంగ విధానాలు అవలంబిస్తున్న మతోన్మాద భాజపాను ఓడించాలన్నారు.  ఓపీడీఆర్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దండా లింగయ్య, యూసీసీఆర్‌ఐ(ఎంఎల్‌) రాష్ట్ర నాయకుడు పోలెబోయిన ముత్తయ్య, గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు కల్తీ రామచంద్రయ్య, షేక్‌ సోందుమియా, ఓపీడీఆర్‌ జిల్లా కార్యదర్శి జక్కం శ్రీను, డీఎస్‌వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్తీ లెనిన్, నవోదయ కళాకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని