కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దు: కేటీఆర్
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు.
కొత్తగూడెం సింగరేణి, ఇల్లెందు, న్యూస్టుడే: శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మంలో సోమవారం నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15 నాటికి రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఏ సంవత్సరమో చెప్పటం లేదని, బహుశా 2030 కావొచ్చునని ఎద్దేవా చేశారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని విమర్శించారు. భారాస హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రంలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా వాటిని 33కి పెంచిన ఘనత కేసీఆర్దేనన్నారు. భద్రాద్రి రాముడి పేరిట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిలర్ అని, అతడిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కాబోవన్నారు. భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే వేతనాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి వెచ్చిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, బాణోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
దొంగల హల్చల్.. ఇల్లెందులో కేటీఆర్తో సెల్ఫీ దిగేందుకు పార్టీ నాయకులు, యువకులు ఎగబడ్డారు. ఈక్రమంలో తోపులాట జరిగింది. టేకులపల్లి మండల భారాస అధ్యక్షుడు వరప్రసాద్ జేబులోని రూ.50వేలు, గార్ల మండలానికి చెందిన గణేష్ జేబులోని రూ.9వేలు, మరో వ్యక్తికి చెందిన రూ.3వేలను దొంగలు తస్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
[ 27-07-2024]
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కట్ట శేఖర్ డిమాండ్ చేశారు. -
పోరాటాల ఫలితమే చేయూత పథకం
[ 27-07-2024]
చేయూత పథకం ద్వారా రూ.4,000 చెల్లించే విధంగా మంత్రి సీతక్క ప్రకటన చేశారని ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు వెంకట నారాయణ పేర్కొన్నారు. -
అశ్వారావుపేటలో ఏపీ మంత్రులు
[ 27-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి నష్ట పోయిన ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వెళ్తున్న ఏపీ మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు.. -
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్