ఉప ఎన్నికల సమరం.. రసవత్తరం
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీగా గెలుపొందినవారు 2027 మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది నిలిచారు.
ఖమ్మం జిల్లాలో 118.. భద్రాద్రిలో 55 పోలింగ్ కేంద్రాలు
ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరగనుంది.బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా బ్యాలెట్ బాక్స్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఓటర్ల తుది జాబితాను ఇదివరకే ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రి జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలకు వరుసగా 140, 69 బ్యాలెట్ బాక్స్లను సమకూర్చనున్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్, భద్రాద్రి జిల్లాలోని రామచంద్ర డిగ్రీ కళాశాలలో పోలింగ్ సామగ్రిని సిబ్బందికి ఆదివారం అందించనున్నారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్స్లను నల్గొండకు తరలిస్తారు. ఇందుకు సంబంధించి వాహనాలు, భద్రత సిబ్బందిని కేటాయించారు.
సిబ్బంది నియామకం
పోలింగ్ కేంద్రాల సంఖ్యకు 20 శాతం అదనంగా సిబ్బందిని అధికారులు నియమించారు. ఖమ్మం జిల్లాలో 142 మంది ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), 142 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు,) 284 మంది ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓలు), భద్రాద్రి జిల్లాలో 66 మంది పీఓలు, 66 మంది ఏపీఓలు, 136 మంది ఓపీఓలు విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనీల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును గమనించనున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సెక్టోరల్ అధికారులు, సూక్ష్మపరిశీలకులు, నోడల్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు.
ముమ్మరంగా ప్రచారం
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. 52 మంది పట్టభద్రులు బరిలో నిలవగా ప్రధానంగా మూడు పార్టీల మధ్యే హోరాహోరీ పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎలాగైనా ఈస్థానంలో సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారాస పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో మెరుగైన ఓట్లు సాధించామని, ఈసారి పాగా వేయాలనే తలంపుతో భాజపా వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, భారాస నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, భాజపా తరఫున గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బరిలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం