ప్రమాదంలో పశ్చిమ్ బంగా కూలీ మృతి
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో పాల్గొంటున్న పశ్చిమ్ బంగా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటనపై ఖమ్మం నగరం ఖానాపురంహవేలి పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది.
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో పాల్గొంటున్న పశ్చిమ్ బంగా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటనపై ఖమ్మం నగరం ఖానాపురంహవేలి పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ కథనం ప్రకారం... పశ్చిమ్బంగా రాష్ట్రం నదియా శాంతిపూర్కు చెందిన గంగారాజోవర్(45) గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో కూలీగా పాల్గొంటున్నాడు. ధంసలాపురం సమీపంలో సోమవారం మధ్యాహ్నం వంతెన పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వంతెనపై నుంచి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని బంధువు ప్రభాస్ రాజోవర్ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు.
అనుమానాస్పద స్థితిలో కార్మికుడు..
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: గ్రానైట్ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరం ఖానాపురం పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం జరిగింది. ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ కథనం ప్రకారం... ఖమ్మం నగరం పార్శిబంధంలో నివసించే శ్రీను(44) కైకొండాయిగూడెం ప్రైం ప్రభు గ్రానైట్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. విధులకు వెళ్తున్నానని మంగళవారం తెల్లవారుజామున వెళ్లిన అతను పరిశ్రమ కార్యాలయం పైన ఉన్న రేకుల షెడ్డులో చీరతో ఉరి వేసుకుని మృతి చెంది ఉండగా గుర్తించారు. తన తండ్రి శ్రీను మరణంపై తమకు అనుమానంగా ఉందని కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు.
భార్యతో గొడవపడి భర్త బలవన్మరణం
మోతె, న్యూస్టుడే: కుటుంబ సమస్యల నేపథ్యంలో భార్యతో గొడవపడి విద్యుత్తు నియంత్రికను పట్టుకొని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ సమీపంలోని మల్లేన్ చెరువు వద్ద మంగళవారం వెలుగుచూసింది. ఎస్సై యాదవేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పైనంపల్లికి చెందిన కంచెం కొమరయ్య(38), రమ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. ఈనెల 15న భార్యతో ఇంటి వద్ద కొమరయ్య గొడవపడ్డారు. అనంతరం పిల్లలను తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్లిపోయారు. మనస్తాపానికి గురైన కొమరయ్య.. ఉర్లుగొండ శివారులోని విద్యుత్తు నియంత్రిక వద్దకు సోమవారం రాత్రి చేరుకున్నారు. నియంత్రికను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమివ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. కొమరయ్య భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
లోయలో ట్రాక్టర్ పడి యువకుడి మృత్యువాత
తాడ్వాయి, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామెరతోగు గ్రామానికి చెందిన వొక్కటి రోహిత్(26) తమ ట్రాక్టరు మరమ్మతుల కోసం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో కొడిశాల సమీపంలో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రోహిత్ అక్కడికక్కడే మృతిచెందారు. తాడ్వాయి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాక్టరు, మృతదేహాన్ని బయటికి తీసి ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం