రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
దమ్మపేట మండలంలో వరుసగా చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాలు ఇద్దరు యువకులను, ఓ బాలుడిని బలితీసుకున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన రెండు లారీలు వారి పాలిట మృత్యుశకటాలయ్యాయి.
కుంజా నాగేంద్రబాబు, సోయం నాగేంద్రబాబు
దమ్మపేట, న్యూస్టుడే: దమ్మపేట మండలంలో వరుసగా చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాలు ఇద్దరు యువకులను, ఓ బాలుడిని బలితీసుకున్నాయి. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన రెండు లారీలు వారి పాలిట మృత్యుశకటాలయ్యాయి. పాల్వంచ-దమ్మపేట రహదారిలో రెండు కిలోమీటర్ల పరిధిలో ఒకే రోజు జరిగిన రెండు ప్రమాదాలు స్థానికుల గుండెలను బరువెక్కించాయి. లారీల కిందపడి నలిగిపోయిన యువకుల దేహాలను చూసి గ్రామాల ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొర్రెగుట్ట గ్రామానికి చెందిన కుంజా నాగేంద్రబాబు(19), గండుగులపల్లికి చెందిన తన స్నేహితులు సోయం నాగేంద్రబాబు(19), గోరం సాగర్తో కలసి ద్విచక్రవాహనంపై మంగళవారం పట్వారిగూడెం గ్రామానికి వచ్చారు. అనంతరం దమ్మపేట వస్తుండగా పట్వారిగూడెం కూడలిలో పాల్వంచ వైపు అతివేగంగా వెళ్తున్న ఓలారీ వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు హుటాహుటిన 108లో సత్తుపల్లి తరలిస్తుండగా, మార్గమధ్యంలో కుంజా నాగేంద్రబాబు మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికీ సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్తుండగా సోయం నాగేంద్రబాబు మృతిచెందాడు. ఖమ్మంలో చికిత్స పొందుతున్న సాగర్ పరిస్థితీ విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్థానికులతో కలసి క్షతగాత్రులను దగ్గరుండి వైద్యశాలకు పంపే ఏర్పాట్లు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సాయికిషోర్రెడ్డి పరిశీలించారు.
పార్కెలగండి వద్ద..: పట్వారిగూడెంలో లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనకు కొద్ది గంటల ముందు సమీపంలోని పార్కెలగండిలో ఇదే తరహా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదహారేళ్ల బాలుడు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పూసుకుంట పంచాయతీ కట్కూరు గ్రామానికి చెందిన పూనెం రమేశ్ అదే గ్రామానికి చెందిన పర్సిక చరణ్(16)తో కలసి ద్విచక్రవాహనంపై దమ్మపేటకు వస్తున్నాడు. పార్కెలగండి సమీపంలో వీరి వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై సాయికిషోర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కపక్క గ్రామాల్లో ఒకేతీరున ముగ్గురు మృత్యువాత పడటంతో పట్వారిగూడెం, పార్కెలగండి గ్రామాల్లో తీవ్ర విషాదం అలముకుంది. పాల్వంచ-దమ్మపేట రహదారిలో వాహనాల మితిమీరిన వేగం పట్ల పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల