ఆతిథ్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్) ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల మంగళవారం తెలిపారు.
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్టుడే: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్) ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల మంగళవారం తెలిపారు. ఈ సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్లోని 26 ఎకరాల సువిశాలమైన స్థలంలో మూడు కోర్సులను ఏర్పాటు చేసి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోర్సులుగా పేరొందిన ఐఐటీ, ఐఏఎం సంస్థల మాదిరిగా టూరిజం హాస్పిటాలిటీ కోర్సులకు ఇక్కడ శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఎంబీఏ, బీబీఏ, బీఎస్సీ మూడు కోర్సులను ఈ సంస్థ అందిస్తోందని, జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 95537 00035, 94904 35240, 95537 00034 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ కోర్సు)
రెండేళ్ల కాల వ్యవధి ఉన్న ఈ కోర్సులో చేరేందుకు జనరల్ విద్యార్థులు కనీసం 50 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతం మార్కులతో ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత సాధించడంతోపాటు మ్యాట్ లేదా క్యాట్/ ఐసెట్/ ఏటీఎంఏ లేదా తత్సమాన పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి. వ్యక్తిగత ఇంటర్వ్యూతోపాటు గ్రూపు డిస్కషన్ ద్వారా ఈ కోర్సులకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. గరిష్ఠ వయో పరిమితి లేకుండా అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
బీబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ కోర్సు)
నాలుగేళ్ల కాలవ్యవధి ఉన్న ఈ కోర్సులో చేరేందుకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు యూజీఏటీ/ఏటీఎంఏ యూజీ/ఎంసెట్ లేదా ఎన్సీహెచ్ఎంటీ జేఈఈ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండి, వయస్సు 22 సంవత్సరాలు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీలు అయితే 25 సంవత్సరాలకు మించకూడదు. జాతీయ స్థాయిలో జరిగే ఎన్సీహెచ్ఎంటీ జేఈఈ ద్వారా నిథిమ్ నిర్వహించే ఏడబ్ల్యూటీ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు)
మూడేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ కోర్సులో చేరేందుకు టెన్ ప్లస్ టూ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సులో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో ఎన్సీహెచ్ఎంటీ-2023 జేఈఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్సీహెచ్ఎంటీ వెబ్సైట్ను ఆశ్రయించాలని కలెక్టర్ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే