దృష్టి సారిస్తేనే ఉపయుక్తం..!
విద్యార్థులు నేత్ర సమస్యలతో బాధపడుతున్నారు. పుస్తకాల్లో, తరగతి గదుల్లో బోర్డుపై రాసే అక్షరాలను సరిగ్గా చూడలేపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, వసతిగృహ విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు.
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే: విద్యార్థులు నేత్ర సమస్యలతో బాధపడుతున్నారు. పుస్తకాల్లో, తరగతి గదుల్లో బోర్డుపై రాసే అక్షరాలను సరిగ్గా చూడలేపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురుకులాలు, వసతిగృహ విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 8 నుంచి 22 వరకు ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 16,610 మందికి పరీక్షలు పూర్తి చేశారు. విద్యా సంవత్సరం ముగిసే చివరి రోజుల్లో హడావుడిగా కార్యక్రమాన్ని మొదలెట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల వరకు అందరికీ పరీక్షలు చేయాల్సి ఉంది. దాదాపు 12 ఆర్బీఎస్కే (రాష్ట్రీయ్ బాల స్వాస్థ్య కార్యక్రమం) వైద్య బృందాల ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొందరికి మాత్రమే పరీక్షలు చేశారు. ఇంతలో సెలవులు రావడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు.
990 మందికి సమస్యలు
విద్యా సంవత్సరం చివరలో ప్రారంభమైన నేత్ర పరీక్షల నిర్వహణ కార్యక్రమం విద్యార్థులకు అంతగా ఉపయోగపడలేదు. అప్పటికే ఇంటర్ పరీక్షలు ముగియటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. అలాగే పదోతరగతి వార్షిక పరీక్షలు పూర్తి కావడంతో సెలవులు ప్రకటించారు. అందుబాటులో ఉన్న విద్యార్థులకు మాత్రమే కంటి పరీక్షలు చేశారు. మొత్తంగా పరీక్షలు పూర్తైన వారిలో 990 మందికి రిఫ్లెక్టివ్ ఎర్రర్స్ ఉన్నట్లు గుర్తించారు. వారంతా అక్షరాలను సరిగా గుర్తుపట్టలేకపోతున్నారని తేల్చారు. మరో 57 మందికి కంటి జబ్బులు ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినా పరీక్షల నిర్వహణ అసంపూర్తిగా మిగిలిపోయింది. దీనిపై ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ ప్రమీళ మాట్లాడుతూ.. వచ్చే విద్యాసంవత్సరం విద్యార్థులందరికీ నేత్ర వైద్యపరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు.
1వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం విద్యార్థులు: 1.13 లక్షలు
నేత్రవైద్య పరీక్షల నిర్వహణ ఇలా..
చేసిన పరీక్షలు 16,610
బాలురు 6,678
బాలికలు 9,932
సమస్యలున్నవారు
బాలురు 209
బాలికలు 781
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
[ 27-07-2024]
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కట్ట శేఖర్ డిమాండ్ చేశారు. -
పోరాటాల ఫలితమే చేయూత పథకం
[ 27-07-2024]
చేయూత పథకం ద్వారా రూ.4,000 చెల్లించే విధంగా మంత్రి సీతక్క ప్రకటన చేశారని ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు వెంకట నారాయణ పేర్కొన్నారు. -
అశ్వారావుపేటలో ఏపీ మంత్రులు
[ 27-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి నష్ట పోయిన ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వెళ్తున్న ఏపీ మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు.. -
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్