ఇక సన్న‘గిల్లవ్’ ఆశలు
ఈ వానాకాలం నుంచి సన్నరకం ధాన్యం పండించే రైతులకు సర్కారు అండగా నిలవనుంది. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది.
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: ఈ వానాకాలం నుంచి సన్నరకం ధాన్యం పండించే రైతులకు సర్కారు అండగా నిలవనుంది. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. రేషన్ దుకాణాల ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తామని శాసనసభ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీని నెరవేర్చే క్రమంలో రైతులు దొడ్డు రకానికి చెందిన ఎంటీయూ-1010, 1061 ధాన్యం పండించకుండా వ్యవసాయశాఖ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. వీలైనంత ఎక్కువ మంది కర్షకులు సన్నరకాల సాగుకు పూనుకునేలా చొరవ తీసుకోనుంది.
సన్నాలకు పెట్టుబడి భారం..
సన్నాలకు చీడపీడలు సోకి తక్కువ దిగుబడులు వస్తున్నాయి. బీపీటీ-5204 వంటి సన్నరకాలకు చెందిన వరి పంటకు అగ్గితెగుళ్లు, సుడిదోమ, కాండం తొలిచే పురుగు, ఆకుచుట్టు పురుగు వంటివి ఆశిస్తాయి. వీటి నివారణకు వాడే పురుగు, తెగుళ్ల మందులతో పెట్టుబడి భారం అధికమవుతుంది. ఎరువులపై 5 శాతం, పురుగు మందులపై 18 శాతం జీఎస్టీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయి. ఈమేరకు ఆయా కంపెనీలు ధరలు పెంచి రైతులపై భారం మోపుతున్నాయి. అందుకే పెట్టుబడి భారం తగ్గించుకునేందుకు, దిగుబడులు అధికంగా వచ్చే దొడ్డు రకాల సేద్యం వైపు అన్నదాతలు మొగ్గుచూపుతున్నారు.
పేదలకు అందించాలనే లక్ష్యంతో..
హరిత విప్లవం అనంతరం 40 ఏళ్లుగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగి, సాగునీరు సమృద్ధిగా లభిస్తుండటంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారిపోయింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాసిరకం మొద్దు బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేయటంతో వాటిని తినేందుకు ఇష్టపడని కొందరు కిలో రూ.10కే అమ్మేసుకుంటున్నారు. దీన్ని నివారించేందుకే సన్నరకాలు పండించేలా రైతులను ప్రోత్సహించి పేదలకు సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రెండింటికీ ఒకటే ధర..
భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) ఎంటీయూ-1010 రకం దొడ్డు ధాన్యాన్ని ‘ఏ’ గ్రేడ్గా గుర్తించి బియ్యం సేకరిస్తోంది. బీపీటీ-5204 సన్నరకాలనూ ‘ఏ’గ్రేడ్గా గుర్తించి కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరించటంతో మిల్లర్లకు వరంగా మారింది. సన్నాలు, దొడ్డురకాలకు ఒకే ధర చెల్లించటంతో రైతులు అధికంగా దొడ్డు రకాల సాగుకు మొగ్గు చూపుతున్నారు.
సత్ఫలితాలు ఇలా సాధ్యం..
దొడ్డురకాల కంటే సన్నరకాలకు క్వింటాకు రూ.450కిపైగా మద్దతు ధర పెంచటం.
క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించటం.
ఎరువులపై 5 శాతం, పురుగు మందులపై 18 శాతం జీఎస్టీని ఎత్తివేయటం.
పవర్ స్ప్రేయర్లు, డ్రోన్లను రాయితీపై రైతులకు సరఫరా చేయటం.
సన్నరకాల విత్తనాలను సబ్సిడీపై అందించటం
ఎప్పటికప్పుడు చీడపీడల నివారణకు శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తే ఆశించిన దిగుబడులతో ధాన్యాగారాలను సన్నరకాలతో నింపేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం