పుడమి తల్లికి ప్రాణం పోద్దాం..
వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల నుంచి వచ్చే అవశేషాలు, వ్యర్థాలను తొలగించే క్రమంలో రైతులు ఇటీవల పలు పొరపాట్లు చేస్తున్నారు. ఆయా పంటల కాలం ముగిశాక పొలాన్ని శుభ్రం చేయాలని, తదుపరి పంటకు భూమి సిద్ధం
పంట అవశేషాలకు నిప్పు పెట్టకండి
కేవీకే సీనియర్ శాస్త్రవేత్త కె.రవికుమార్తో ముఖాముఖి
వైరా, న్యూస్టుడే
వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల నుంచి వచ్చే అవశేషాలు, వ్యర్థాలను తొలగించే క్రమంలో రైతులు ఇటీవల పలు పొరపాట్లు చేస్తున్నారు. ఆయా పంటల కాలం ముగిశాక పొలాన్ని శుభ్రం చేయాలని, తదుపరి పంటకు భూమి సిద్ధం కావాలనే ఆతృతలో పంటల వ్యర్థాలను పొలంలో తగులబెడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. అంతేకాకుండా సారం పెంచుకోవాల్సిన భూమికి నష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. పంట అవశేషాలను తగులబెట్టకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సైతం సూచిస్తుంది. దీనిపై రైతుల్లోనూ అవగాహన పెంచాల్సిన తరుణంలో వైరా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కీటక శాస్త్రవేత్త డాక్టర్ కె.రవికుమార్తో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది.
ప్రశ్న: ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సాగు చేసే పంటలు ఏమిటీ?
జవాబు: ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో వరి 3.84 లక్షల ఎకరాలు, పత్తి 3.87 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 54 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. యాసంగిలో వరి 1.58, మొక్కజొన్న 83 వేల వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
ఏ పంటల నుంచి ఎక్కువ వ్యర్థ, అవశేషాలు ఉత్పత్తి అవుతుంటాయి.
మ్మడి జిల్లాలో సాగు చేసే పంటల్లో సుమారు 92.3 శాతం వ్యర్థ అవశేషాలు వరి, పత్తి, మొక్కజొన్న నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఒక హెక్టారులో పండించిన వరి నుంచి 6-7.5 టన్నులు, పత్తి నుంచి 2-3 టన్నులు, మొక్కజొన్న నుంచి 40-45 టన్నుల అవశేషాలు ఉత్పత్తి అవుతున్నట్లు ప్రాథమిక అంచనాగా ఉంది.
పంట అవశేషాలు తగలబెట్టడంతో కలిగే నష్టాలు.
షనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో ఏ ప్రాంతంలోనైనా పొలాల్లో అవశేషాలు కాల్చకూడదని నిర్దేశించింది. తగలబెట్టకుండా యూరియాతో మాగపెట్టి పోషక విలువలు పెంచుకోవచ్చు. ఆయా అవశేషాలతో భూమిలో సారం పెరుగుతుంది. తదుపరి ఎలాంటి పంటలు వేసినా పోషక విలువలు పెంచి పంటకు మంచి చేస్తాయి. అధిక దిగుబడులు వస్తాయి. కానీ రైతులు కాల్చడంతో అనేక నష్టాలు ఉంటాయి. ఒక టన్ను వరి గడ్డి కాల్చడంతో 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం, 1.2 కిలోల సేంద్రియ కార్బనం భూమికి అందకుండా కోల్పోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా 60 కిలోల కార్బన్ మోనాక్సైడ్, 1460 కిలోల కార్బన్డయాక్సైడ్, 199 కిలోల బూడిద, రెండు కిలోల సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలై వాయు కాలుష్య మవుతుంది. ఎకరం మొక్కజొన్న నుంచి వచ్చే పంట అవశేషాలను కాల్చడంతో 27 కిలోల నత్రజని, 6.75 కిలోల భాస్వరం, 54 కిలోల పోటాష్ వృథా అవుతుంది. హెక్టారు పత్తి పంట నుంచి వచ్చే అవశేషాలను కాల్చితే 20 కిలోల నత్రజని, 1.6 కిలోల భాస్వరం, 14 కిలోల పొటాష్ భూమికి అందకుండాపోతుంది. దీంతో ఆయా అవశేషాలను పొలంలోనే కుళ్లేలా కలిసిపోయేలా చేసుకోవాలి. మానవ ఊపిరితిత్తులకు సమస్యలు కలిగించే క్యాన్సర్ కారకాలు గాలిలోకి విడుదలవుతాయి. మండే అవశేషాల నుంచి వచ్చే వేడితో నేల ఉష్ణోగ్రత పెరిగి నేలలో ఉండే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి. గ్రీన్హౌజ్ వాయువులు, ఇతర విషవాయువులు విడుదలై వాతావరణంలో ప్రతికూలతకు దారి తీస్తాయి.
ఆయా పంటల వ్యర్థ, అవశేషాలను రైతులు ఎంత మేరకు కాల్చుతున్నారు.
గణాంకాల ప్రకారం 40 శాతం వరి కొయ్యలు లేదా దుబ్బులను, 90 శాతం పత్తి మోళ్లను రైతులు పొలంలోనే కాల్చుతున్నారు. పంటలు కోసిన తర్వాత కొద్ది శాతం మాత్రమే పశువుల మేతకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఆయా అవశేషాలను ఏరటం కష్టతరంగా ఉండటం, మరో పంట వేసుకునేందుకు పొలం సిద్ధం చేయాలనుకునే క్రమంలో అనవసరంగా రైతులు ఆయా వ్యర్థాలకు నిప్పుపెడుతున్నారు. పంట వ్యర్థాలు కుళ్లేందుకు ఎక్కువ రోజుల సమయం అవసరమనే ఆలోచన రైతుల్లో ఉంటోంది. పశు సంపదగా మరల్చాలనే ఆలోచన కూడా తగ్గిపోతుండటం ప్రతికూలతగా ఉంది. కాల్చడంతో చీడపీడల కారకాలు చనిపోతాయనే అపోహ రైతుల్లో ఉంది. వ్యర్థాలను తొలగించేందుకు కూలీలు, యంత్రాల ఖర్చు పెరుగుతుందనే భావన రైతులు తీసివేయాలి.
పంట అవశేషాలను కాల్చకుండా వినియోగిస్తే కలిగే లాభాలేమిటి.
స్వల్పకాలిక వరి రకాలను ఎన్నుకోవడం ద్వారా త్వరగా కోతలు చేపట్టవచ్చు. మరో పంట వేసే వరకు సమయం ఉంటుంది. ఈక్రమంలో పొలంలోనే కలియదున్నితే పొలానికి, రైతుకు మంచి జరుగుతుంది. వరిగడ్డితోపాటు ఇతర పంటల వ్యర్థాలు త్వరగా కుళ్లేందుకు సింగిల్ సూపర్ పాస్పేట్ లేదా సూక్ష్మజీవుల నుంచి తయారు చేసిన పదార్థాలను ఉపయోగించుకోవచ్చు. పంటల మార్పిడితో అవశేషాల యాజమాన్యం సులువుగా ఉంటుంది. వరి అవశేషాలను విద్యుత్తు ఉత్పత్తి లేదా పుట్టగొడుగుల పరిశ్రమకు వాడొచ్చు. అలాగే వర్మి కంపోస్టు లేదా బయోగ్యాస్కు వినియోగించొచ్చు. వరికోత యంత్రాలకు వరి గడ్డిని చిన్నముక్కలుగా చేసే పరికరం ఉంచడంతో అవశేషాలు త్వరగా విచ్ఛిన్నమవుతాయి. రోటవేటర్తోనూ అవశేషాలు విచ్ఛిన్నమవుతాయి. వరి పంట తర్వాత దున్నకుండానే మొక్కజొన్నను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం