వానొచ్చెనంటే.. వణుకొస్తది..!
ఈసారి రుతుపవనాలు కాసింత ముందుగా ప్రవేశించే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గతేడాది కన్నా అధిక వర్షాలు కురుస్తాయని సంకేతాలిస్తోంది. కొన్నేళ్లుగా వర్షాకాలంలో ఖమ్మం నగరంతో పాటు మిగతా పురపాలికల్లోని కొన్ని కాలనీలు చిగురుటాకులా వణుకుతున్నాయి.
ఈటీవీ, ఖమ్మం
గతేడాది ఖమ్మంలో మహోºగ్రరూపం దాల్చిన మున్నేరు
ఈసారి రుతుపవనాలు కాసింత ముందుగా ప్రవేశించే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గతేడాది కన్నా అధిక వర్షాలు కురుస్తాయని సంకేతాలిస్తోంది. కొన్నేళ్లుగా వర్షాకాలంలో ఖమ్మం నగరంతో పాటు మిగతా పురపాలికల్లోని కొన్ని కాలనీలు చిగురుటాకులా వణుకుతున్నాయి. వేలాది మంది నిరాశ్రయులవుతున్నారు. రూ.కోట్ల ఆస్తి నష్టం సంభవిస్తోంది. అయినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే వాదనలున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత చర్యలు చేపట్టకపోవటం, కనీసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
నగరానికి ఏమైంది..?
గతేడాది మున్నేరు మహోగ్రరూపం దాల్చటంతో ఖమ్మం నగరంలోని వెంకటేశ్వరకాలనీ, బొక్కలగడ్డ, మంచికంటినగర్, మోతీనగర్, పద్మావతినగర్ తదితర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇళ్లల్లోని విలువైన వస్తువులు కొట్టుకుపోయాయి. ఖమ్మం గ్రామీణం మండలంలోని వివిధ ప్రాంతాల్లోనూ వరద విలయతాండవం చేసింది. రాజీవ్గృహకల్ప, వికలాంగులకాలనీ, సాయికృష్ణ నగర్, నాలుగోతరగతి ఉద్యోగుల కాలనీ, కరుణగిరి, నాయుడుపేట, జలగంనగర్, కేబీఆర్నగర్, సాయిప్రభాత్నగర్, వెంకటగిరిలోని కోటానారాయణపురం, ఇందిరమ్మకాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. మున్నేరుకు కరకట్టల నిర్మాణంతో వరద కష్టాలు తీర్చాలని ప్రభుత్వం సంకల్పించింది. పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ ఈ సీజన్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు. అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ముందస్తుగా పునరావాస చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వైరా.. ప్రతిపాదనలకే పరిమితం
వైరా పురపాలికలోని ఇందిరమ్మకాలనీ, రాజీవ్కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. నల్లచెరువు పొంగితే సమీప కాలనీలూ జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. ముంపు నివారణకు కరకట్ట నిర్మించాలనే ప్రతిపాదనలు 15 ఏళ్లుగా కార్యరూపం దాల్చటం లేదు.
ఇల్లెందులో ఏటా ఇదే తీరు..
ఇల్లెందులో బుగ్గవాగు పొంగితే ఇల్లెందులపాడు, 3, 5వ వార్డులు, చర్చి ఏరియా, స్టేషన్బస్తీ ఏరియాల్లోకి వరద నీరు చేరుతుంది. బుగ్గవాగుతో పాటు డ్రైనేజీ కాల్వల్లో పూడిక తొలగిస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్టే.
సత్తుపల్లి.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
సత్తుపల్లి పురపాలికలోని ఎన్టీఆర్నగర్, రాజీవ్కాలనీలను వరద నీరు ముంచెత్తుతుంది. మురుగుకాల్వల్లో పూడిక పేరుకుపోవటమే దీనికి కారణం. శివారు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న మురుగుకాల్వలు పొంగి ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిస్తే సమస్య పరిష్కారమవుతుంది.
మధిర.. మట్టి కట్ట కనుమరుగైనా..
మధిర పురపాలికలో అంబర్పేట పెద్దచెరువు లోతట్టు ప్రాంతాల్లోని ముస్లింకాలనీ, హనుమాన్కాలనీ, వరదరాఘవాపురం, ఎంప్లాయిస్కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకుంటాయి. కొన్నేళ్ల క్రితం నిర్మించిన మట్టి కట్ట కనుమరుగైంది. దీని స్థానంలో కి.మీ. మేర రాతికట్ట నిర్మించాలనే ప్రతిపాదన అటకెక్కింది.
కొత్తగూడెం.. శాశ్వత చర్యలు శూన్యం
గతేడాది పాతకొత్తగూడెంలోని పునరావాస కేంద్రంలో చంటిపిల్లలతో సహా తలదాచుకున్న నిర్వాసితులు
కొత్తగూడెం పట్టణంలోని రామవరంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. సుభాష్చంద్రబోస్నగర్, హౌజింగ్బోర్డుకాలనీ, ఎస్సీకాలనీలు ముంపునకు గురవుతాయి. ప్రశాంత్నగర్, ప్రగతినగర్ను ముంపు ముప్పు వెంటాడుతోంది. ఆసమయంలో స్థానికులను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు తప్పితే శాశ్వత చర్యలు చేపట్టం లేదు. ఎగువ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మణుగూరు.. గైడ్ వాల్స్ ఎత్తు పెంచాలి
మణుగూరు పట్టణంలోని కట్టువాగు, మొట్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తే సుందరయ్య నగర్, ఆదర్శనగర్, మేదరబస్తీ, పైలెట్కాలనీ, కాళీమాత టెంపుల్, శేషగిరినగర్, బాలజీనగర్ ముంపునకు గురవుతాయి. వరద నీరు గోదావరిలో కలవాల్సి ఉన్నా అందుకు తగ్గ చర్యలు తీసుకోకపోవటంతో కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోతున్నాయి. గైడ్ వాల్స్ ఎత్తు పెంచి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు వేడుకుంటున్నారు.
ఖమ్మం నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించాం. ఈసారి నగరపాలక సంస్థ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా గ్యాంగ్ వర్కర్లను అందుబాటులో ఉంచుతాం. మురుగుకాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తాం. ప్రధాన కాల్వల్లో పూడిక తొలగిస్తాం. కరకట్ట నిర్మాణం పూర్తయితే ముంపు ముప్పు తప్పుతుంది.
ఆదర్శ్ సురభి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
వసతలు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ పిల్మ్సిటీలో ప్రెండిషిప్ వీక్
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?