అగ్నిగుండంగా గరిమెల్లపాడు
ప్రచండ భానుడి ప్రతాపంతో మన్యం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాష్ట్రంలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్టుడే
కొత్తగూడెం రామవరం వద్ద నిర్మానుష్యంగా జాతీయ రహదారి
ప్రచండ భానుడి ప్రతాపంతో మన్యం జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచే సూరీడు సుర్రుమంటున్నాడు. అర్ధరాత్రయినా వేడి సెగలు తగ్గడం లేదు. రాష్ట్రంలో గురువారం అత్యధిక పగటి ఉష్ణోగ్రత (ఉదయం 8 నుంచి సాయంత్రం 5 మధ్య) మంచిర్యాల జిల్లా భీమారంలో 47.2 డిగ్రీల సెల్సియస్.. ఆతర్వాత చుంచుపల్లి మండల పరిధిలోని గరిమెళ్లపాడులోనే 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం విశేషం. భద్రాద్రి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. పిల్లలు, వృద్ధులు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎండ తీవ్రతతో విద్యుత్తు ఉపకరణాలు మరమ్మతులకు గురవుతున్నాయి. ఫలితంగా పట్టణాల్లో తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఇదే సమస్యతో కొత్తగూడెం పట్టణంలో గురువారం రాత్రి 9 గంటలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అరగంట దాటినా సరఫరాను పునరుద్ధరించలేదు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా రాత్రిపూట తరచూ విద్యుత్తు అంతరాయాలు ఏర్పడటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.
కానరాని ఉపశమన చర్యలు: ఇటీవల ఎండలు మండిపోతున్నా జిల్లాలోని పరిశ్రమలు, పారిశ్రామిక వాడల్లో ఉపశమన చర్యలు కానరావటం లేదు. కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేయట్లేదు. సింగరేణి బొగ్గు గనులు, కేటీపీఎస్, బీటీపీఎస్, పాల్వంచ ఎన్ఎండీసీ, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ తదితర పరిశ్రమలు, పరిసర ప్రాంతాల్లో వాతావరణాన్ని చల్లబరిచే కార్యక్రమాలను అరకొరగా చేపడుతున్నారని వాదనలున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే పని ప్రదేశాలతో పాటు ప్రధాన రహదారులను నీటి ట్యాంకర్లతో చల్లబర్చాలి. ఇప్పటికైనా ఈదిశగా యాజమాన్యాలు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ.. వేసవి ఉపశమన చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం వడదెబ్బ బారినపడకుండా అవగాహన కల్పించాలని, బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందేలా చూడాలని పలువురు కోరుతునున్నారు.
23 మండలాల్లోనూ.. 40 డిగ్రీల సెల్సియస్కు పైనే..!
వారం నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా గరిమెళ్లపాడులో 47.1 డిగ్రీలు నమోదవగా.. ఆ తర్వాత అశ్వాపురం 45.9, భద్రాచలం 44.9, పినపాక 44.5, పాల్వంచ 44.3, చుంచుపల్లి 44.2, మణుగూరు 44, దుమ్ముగూడెం 44, లక్ష్మీదేవిపల్లి 43.9, చర్ల 43, కొత్తగూడెం 42.9, చంద్రుగొండ 42.8, కరకగూడెం 42.8, దమ్మపేట 42.3, అశ్వారావుపేట 42.3, సుజాతనగర్ 42.2, ఆళ్లపల్లి 42.1, ఇల్లెందు 41.9, గుండాల 41.8, జూలూరుపాడు 41.6, బూర్గంపాడు, అన్నపురెడ్డిపల్లి 40.5, ములకలపల్లి, టేకులపల్లిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి మంత్రం.. సంక్షేమ రథం
[ 26-07-2024]
ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క గురువారం ప్రవేశపెట్టిన 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. -
సామర్థ్యాలకు అనుగుణంగా.. బోధన సాగేలా!
[ 26-07-2024]
విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు దేశంలోనే అతిపెద్ద సర్వే నవంబరు నుంచి నిర్వహించనున్నారు. -
బ్రిగేడియర్ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు
[ 26-07-2024]
ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ దౌత్యవేత్త ఏలూరి శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. -
మెరుపు వేగం.. పతకాలు కైవసం
[ 26-07-2024]
మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ఆటే ప్రాణంగా సాధన చేసింది. ఐస్ స్కేటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళుతోంది. -
72 ఏళ్ల యువకుడు..!
[ 26-07-2024]
‘వయసు ఒక నంబరు మాత్రమే’ అని నిరూపిస్తున్నారు భద్రాచలం ఐటీడీఏ ప్రాంతానికి చెందిన గాలి రాంమోహన్రావు ఐటీసీ విశ్రాంత ఉద్యోగి అయిన ఆయన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు పతకాలు సాధించిన శభాష్ అనిపించుకుంటున్నారు. -
రాకాసి గూళ్లు.. చరిత్రకు ఆనవాళ్లు
[ 26-07-2024]
మూడు వేల ఏళ్లనాటి చరిత్రకు ఆనవాళ్లు రాకాసి గూళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం నుంచి వేములూరు మార్గంలోని అడవిలో ఇవి సాక్షాత్కరిస్తాయి. -
యువ రైతు ఆత్మహత్య
[ 26-07-2024]
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నపురెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. -
ఈ సీజన్లోనే పెద్దవాగు నుంచి పంటలకు సాగు నీరు
[ 26-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఈ సీజన్లోనే సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. -
మునిగిన దుమ్ముగూడెం ఆనకట్ట
[ 26-07-2024]
కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట గోదావరి వరద నీట మునిగింది. ఆనకట్ట పైనుంచి సుమారు రెండు, మూడడుగుల ఎత్తుతో వరద నీరు ప్రవహిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!