నిప్పుల కొలిమి
ఎండ వేడితో ఖమ్మం జిల్లా గురువారం నిప్పుల కొలిమిని తలపించింది. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం అల్లాడిపోతున్నారు.
వైరాలో అత్యధికంగా 47 డిగ్రీలు
ఖమ్మం నగరం, న్యూస్టుడే: ఎండ వేడితో ఖమ్మం జిల్లా గురువారం నిప్పుల కొలిమిని తలపించింది. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం అల్లాడిపోతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయి రెడ్జోన్లోకి వెళ్లాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరా పట్టణంలో తొలిసారిగా 47 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ముదిగొండ మండలం పమ్మిలో 46.5, బాణాపురం 45.7, గేట్ కారేపల్లిలో 46.0, ఖానాపురం పోలీస్ స్టేషన్ (ఖమ్మం) 45.8, కొణిజర్ల 45.4, చింతకాని 45.2, నేలకొండపల్లి, తల్లాడ 45.1, కొణిజర్ల మండలం పెద్దగోపతిలో 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదై రెడ్ జోన్కు చేరుకున్నాయి. ఎండ వేడిమి, ఉక్కపోతకు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గాలిలో తేమ తగ్గి పగలు, రాత్రి వేడి గాలులు, ఉక్కపోత ఎక్కువ అవుతోంది. ఎండల ధాటికి విద్యుత్ వినియోగం పెరుగుతోంది.
జిల్లాలో 40 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఉండగా పదకొండింటిలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా మిగతా 39 స్టేషన్స్లో 41.1 నుంచి 44.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా తల్లాడ మండలం కుర్నవల్లిలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
[ 26-07-2024]
చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన కటికల అంజలి (8) అనే చిన్నారి విద్యుదాఘాతంతో మృతి చెందింది. -
అభివృద్ధి మంత్రం.. సంక్షేమ రథం
[ 26-07-2024]
ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క గురువారం ప్రవేశపెట్టిన 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. -
సామర్థ్యాలకు అనుగుణంగా.. బోధన సాగేలా!
[ 26-07-2024]
విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు దేశంలోనే అతిపెద్ద సర్వే నవంబరు నుంచి నిర్వహించనున్నారు. -
బ్రిగేడియర్ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు
[ 26-07-2024]
ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ దౌత్యవేత్త ఏలూరి శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం లభించింది. -
మెరుపు వేగం.. పతకాలు కైవసం
[ 26-07-2024]
మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ఆటే ప్రాణంగా సాధన చేసింది. ఐస్ స్కేటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళుతోంది. -
72 ఏళ్ల యువకుడు..!
[ 26-07-2024]
‘వయసు ఒక నంబరు మాత్రమే’ అని నిరూపిస్తున్నారు భద్రాచలం ఐటీడీఏ ప్రాంతానికి చెందిన గాలి రాంమోహన్రావు ఐటీసీ విశ్రాంత ఉద్యోగి అయిన ఆయన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు పతకాలు సాధించిన శభాష్ అనిపించుకుంటున్నారు. -
రాకాసి గూళ్లు.. చరిత్రకు ఆనవాళ్లు
[ 26-07-2024]
మూడు వేల ఏళ్లనాటి చరిత్రకు ఆనవాళ్లు రాకాసి గూళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం నుంచి వేములూరు మార్గంలోని అడవిలో ఇవి సాక్షాత్కరిస్తాయి. -
యువ రైతు ఆత్మహత్య
[ 26-07-2024]
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నపురెడ్డిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. -
ఈ సీజన్లోనే పెద్దవాగు నుంచి పంటలకు సాగు నీరు
[ 26-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో రైతులు పండిస్తున్న పంటలకు ఈ సీజన్లోనే సాగునీరు అందించేలా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. -
మునిగిన దుమ్ముగూడెం ఆనకట్ట
[ 26-07-2024]
కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట గోదావరి వరద నీట మునిగింది. ఆనకట్ట పైనుంచి సుమారు రెండు, మూడడుగుల ఎత్తుతో వరద నీరు ప్రవహిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?