బడిబాటకు సన్నద్ధం
కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల పోటీ తట్టుకుని.. ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశాలు పెంపొందించేందుకు ఏటా ‘బడిబాట’ నిర్వహిస్తున్నారు.
బాడిబాట కార్యక్రమం (పాతచిత్రం)
పాల్వంచ, న్యూస్టుడే: కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల పోటీ తట్టుకుని.. ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రవేశాలు పెంపొందించేందుకు ఏటా ‘బడిబాట’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. తమ విద్యాలయాలు సాధించిన విజయాలు, బోధనా వసతులను తల్లిదండ్రులకు వివరించి పిల్లలకు ప్రవేశాలు కల్పించనున్నారు. రోజుకొక ప్రత్యేకతతో జూన్ 19 వరకు సుమారు పక్షం రోజుల పాటు కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. తల్లిదండ్రుల్లో చైతన్యం కల్పించి సర్కారు బడుల్లో ప్రవేశాల సంఖ్య పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
గతం కంటే ఆదరణ: ఏటా విద్యా సంవత్సరం పునః ప్రారంభానికి పక్షం రోజుల ముందే బడిబాట నిర్వహిస్తుంటారు. మునుపటి కంటే ఈ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వినూత్న కార్యక్రమాలతో పిల్లలు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకొని సత్వర ప్రవేశాలు కల్పించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వాలు సైతం ‘మన ఊరు/మన పట్టణం - మన బడి’, ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ వంటి పథకాలతో వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాయి. ఇప్పటికే తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన సాగుతోంది. ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలు మెరుగుపడేందుకు నిరంతర శిక్షణలు ఇస్తున్నారు. తొలిమెట్టు వంటి కార్యక్రమాలతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. కార్పొరేట్ విద్యాలయాల స్థాయిలో రెండు జతల ఏకరూప దుస్తులు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఉదయాన్నే రాగిజావ అందిస్తున్నారు. రవాణా భత్యం వంటివీ సమకూర్చుతున్నారు. వీటన్నింటితో పాటు గత సంవత్సరం సాధించిన ఉత్తమ ఫలితాలు ప్రవేశాల పెంపునకు దోహదపడతాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ‘ప్రభుత్వం నిర్దేశించిన విధంగా బడిబాటను విజయవంతం చేయాలి. ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాల్ని చేపట్టి సర్కారు బడులు బలోపేతానికి కృషిచేయాలి’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరాచారి తెలిపారు.
ఇవీ... లక్ష్యాలు
- ఆవాసాల్లో పాఠశాల వయసు పిల్లల్ని గుర్తించి ప్రవేశాలు కల్పించాలి.
- అంగన్వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్న వారిని బడుల్లో చేర్పించాలి.
- ప్రభుత్వ పథకాలను వివరించి గతం కన్నా ప్రవేశాల సంఖ్య పెంచాలి.
- ‘అమ్మ ఆదర్శ’ కమిటీ క్రియాశీల భాగస్వామ్యంతో, స్థానికుల (కమ్యూనిటీ పార్టిసిపేషన్) మద్దతుతో పాఠశాల విద్యను బలోపేతం చేయాలి. బడిబయట ఉన్న పిల్లలందరినీ గుర్తించి సంబంధిత తరగతుల్లో చేర్పించాలి.
- అయిదో తరగతి పూర్తిచేసిన వారిని ప్రాథమికోన్నత, 7, 8 తరగతులు చదివిన వారిని ఉన్నత పాఠశాలల్లో చేర్చాలి.
- గతేడాది తక్కువ ప్రవేశాలున్న చోట తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలి. నాణ్యమైన విద్యా బోధనపై భరోసా కల్పించి విద్యార్థుల సంఖ్య పెంచాలి.
- బాలికా విద్య ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పాలి. డ్రాపౌట్స్ లేకుండా చూసుకోవాలి.
- గ్రామాల్లో పిల్లల విద్యాహక్కుపై అవగాహన కల్పించాలి. ఇంటింటి ప్రచారాలు, సామూహిక అక్షరాభ్యాసం, క్రీడా దినోత్సవాలు నిర్వహించాలి.
- సమర్థమంతమైన పాఠశాల విద్య ప్రక్రియపై అవగాహన పెంపొందించి తల్లిదండ్రుల పాత్రను అధికం చేయాలి.
ఉభయ జిల్లాల్లో గతేడాది బడిబాటలో..
- 1వ తరగతిలో ప్రవేశాలు: 9,010
- 2 నుంచి 10వ తరగతి వరకు: 4,343
- ప్రైవేటు స్కూళ్ల నుంచి వచ్చినవారు: 4,495 (అన్ని తరగతులు కలిపి)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
[ 27-07-2024]
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కట్ట శేఖర్ డిమాండ్ చేశారు. -
పోరాటాల ఫలితమే చేయూత పథకం
[ 27-07-2024]
చేయూత పథకం ద్వారా రూ.4,000 చెల్లించే విధంగా మంత్రి సీతక్క ప్రకటన చేశారని ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు వెంకట నారాయణ పేర్కొన్నారు. -
అశ్వారావుపేటలో ఏపీ మంత్రులు
[ 27-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి నష్ట పోయిన ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వెళ్తున్న ఏపీ మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు.. -
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్