10 Rupee note: రూ.10తో పరేషాన్!.. మార్కెట్లో తగ్గిన నోటు చలామణి
విపణిలో రూ.10 నోటు చలామణి తగ్గింది. వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఖమ్మం అర్బన్, న్యూస్టుడే
విపణిలో రూ.10 నోటు చలామణి తగ్గింది. వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాల క్రితం సాధారణ కొనుగోలుకు 5, 10, 20, 25, 50 పైసల నాణేలు చలామణిలో ఉండేవి. కాలక్రమేణా అవి కనుమరుగై రూపాయి ప్రామాణికంగా చలామణిలోకి వచ్చింది. క్రమంగా ధరల పెరుగుదల కారణంగా రూ.1, 2, 5ల నాణేలు ఉన్నా కొంతకాలంగా రూ.5లు, రూ.10లు ప్రామాణికంగా నడుస్తోంది. వ్యాపారులు ఏదైనా వస్తువు విలువ చెప్పేటప్పుడు రూ.5కు రెండు, రూ.10లకు మూడు అని చెబుతున్నారు. దీంతో కిరాణ, ఫ్యాన్సీ, కూరగాయలు, ఇతర అన్ని సాధారణ వ్యాపారాల్లో రూ.10 ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం రూ.10ల నోటు విపణిలో అందుబాటులో లేక వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.
పెరిగిన ఆన్లైన్ చెల్లింపులు
కరోనా తరువాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆన్లైన్ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. ఏ దుకాణానికి వెళ్లినా, ఏ వస్తువు కొనాలన్నా డిజిటల్ చెల్లింపులు పని చేస్తున్నాయా? అనే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి చెల్లింపులకు ఫోన్పే, గూగుల్పే వంటివి ప్రత్యేకంగా వ్యాలెట్ రూపంలో సులభతర చెల్లింపులు అనుమతిస్తున్నాయి. వీధి వ్యాపారులు, చిన్న దుకాణాల్లో సైతం డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయాయి. దీంతో రూ.5, రూ.10ల లావాదేవీలకు కూడా వినియోగదారులు నోట్లు ఇవ్వడంలేదు. క్రమంగా రూ.10ల నోటు బదలాయింపు జరగకపోవడం వల్ల వ్యాపారులు, వినియోగదారుల వద్ద అందుబాటులో లేకుండా పోయింది. విపణిలో ప్రస్తుతం చిరిగిన రూ.10 నోట్లు దర్శనమిస్తుండటం గమనార్హం.
ఎక్కడ ఆగిందో?
రూ.10లు విపణిలో చలామణి తగ్గడంలో అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సైతం ఈ పరిస్థితిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఎవరైనా వినియోగదారుడు చిరు వ్యాపారుల వద్ద ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు రూ.100ల నోటు ఇస్తే వ్యాపారులు తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో రూ.1, రూ.2ల చెల్లింపులకు బదులు చాక్లెటు, బిస్కెటు వంటివి ఇచ్చేవారు కానీ రూ.10లకు ఏమి ఇవ్వాలని వ్యాపారులు ఆలోచనలో పడ్డారు. ఇస్తే వినియోగదారుడు ఎలా స్పందిస్తారనే ఆందోళన వారిలో ఉంది. భారీ మొత్తాల చెల్లింపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెద్ద మొత్తంలో లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులు జరిగితే వినియోగదారులు, వ్యాపారులు పన్నుల పరిధిలోకి వస్తామని ఆందోళన చెందుతుండటమే ఈ పరిస్థితికి కారణం. చిన్న మొత్తాల చెల్లింపుల కారణంగా కొన్నిసార్లు యూపీఐ సర్వర్లపై భారం పడి పని చేయని పరిస్థితి నెలకొంటోందని వ్యాపారులు చెబుతున్నారు.
నోట్ల కొరత వాస్తవమే
- శ్రీనివాసరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్
పది రూపాయల నోట్ల కొరత ఉన్న మాట వాస్తవమే. రిజర్వ్ బ్యాంకు నుంచి రావడం లేదు. ఇండెంట్ పెడితే రూ.20, 50, 100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. రూ.10ల నోట్లు రావడం లేదు. నాణేలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అవి చెల్లుబాటులో ఉన్నాయని ప్రజలు గమనించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
[ 27-07-2024]
ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కట్ట శేఖర్ డిమాండ్ చేశారు. -
పోరాటాల ఫలితమే చేయూత పథకం
[ 27-07-2024]
చేయూత పథకం ద్వారా రూ.4,000 చెల్లించే విధంగా మంత్రి సీతక్క ప్రకటన చేశారని ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు వెంకట నారాయణ పేర్కొన్నారు. -
అశ్వారావుపేటలో ఏపీ మంత్రులు
[ 27-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి నష్ట పోయిన ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వెళ్తున్న ఏపీ మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు.. -
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..