Congress: ఖమ్మం జిల్లా నుంచి అమాత్యయోగం ఎవరెవరికో..?
రేవంత్రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్.. మంత్రివర్గ కూర్పుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం జిల్లా నుంచి కేబినెట్ బెర్తు ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
రేవంత్రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్.. మంత్రివర్గ కూర్పుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఖమ్మం జిల్లా నుంచి కేబినెట్ బెర్తు ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సీనియర్ నాయకుడిగా, పార్టీకి వెన్నుదన్నుగా మల్లు భట్టివిక్రమార్క నిలిస్తే.. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి అభివృద్ధి మాంత్రికుడిగా తుమ్మల నాగేశ్వరరావు పేరొందారు. పార్టీలో చేరికతోనే ఉభయ జిల్లాల కాంగ్రెస్లో జవసత్వాలు నింపి అత్యధిక స్థానాలు గెలవటంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరించారు. త్వరలో కొలువుదీరబోయే మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం లభిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
👉 Follow EENADU WhatsApp Channel
మల్లు భట్టివిక్రమార్క
రాష్ట్ర కాంగ్రెస్లో కీలక నేత మల్లు భట్టివిక్రమార్కకు మంత్రివర్గంలో సముచితస్థానం దక్కటం ఖాయంగానే కనిపిస్తోంది. మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఆయన విజయఢంకా మోగించారు. మొదటి నుంచి కాంగ్రెస్ వాదిగా ఉన్న భట్టివిక్రమార్క పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఒకసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. రాష్ట్రవ్యాప్త పాదయాత్రతో పార్టీకి ఊపు తీసుకొచ్చారు. సీఎల్పీ నేతగా శాసనసభలో కాంగ్రెస్ తరఫున గళం వినిపించి అధిష్ఠానం వద్ద ప్రత్యేక గుర్తింపు పొందారు. త్వరలో కొలువుదీరబోయే మంత్రివర్గంలో విక్రమార్కకు కీలక పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వంలో అత్యున్నతమైన రెండో పదవి దక్కుతుందన్న ప్రచారం ఆపార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. దళిత సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేత కావటం, పార్టీలో గుర్తింపుతో పాటు అపార అనుభవం కలిగి ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తుమ్మల నాగేశ్వరరావు
నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి మాంత్రికుడిగా ముద్ర పడిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది. రేవంత్రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మంలో పువ్వాడ అజయ్పై గెలుపొందారు. ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తుమ్మల.. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేయటం, పాలనలో అపార అనుభవం కలిగి ఉండటం, సామాజికవర్గ సమీకరణాలు తుమ్మలకు కలిసొస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
అమాత్య పదవి కోసం మరో కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీపడుతున్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఉభయ జిల్లాల్లో ఆపార్టీకి జవసత్వాలు నింపిన నాయకుడిగా పొంగులేటి గుర్తింపు పొందారు. ప్రజాబలం కలిగిన నాయకుడిగా ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పక్షాన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జిల్లాలో అత్యధిక స్థానాలు గెలవడంలో ముఖ్యభూమిక పోషించారు. శాసనసభ ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన పొంగులేటి.. పాలేరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. రేవంత్రెడ్డితోపాటు ఏఐసీసీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం, పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించటం, ఉభయ జిల్లాల్లో తన అనుచరులందరినీ గెలుపించుకోవటం ఆయనకు సానుకూలంగా మారుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కుతాయా లేదా అన్నది ఉత్కంఠ రేపుతుంది. పొంగులేటి, తుమ్మలలో ఒక్కరికే అమాత్యయోగం దక్కితే మరొకరు త్యాగం చేయాల్సి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
- ఈటీవీ-ఖమ్మం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచారం ఉద్ధృతం
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో మళ్లీ పాగా వేయాలని భారాస సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత: నామా
[ 29-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యం: పొంగులేటి
[ 29-04-2024]
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ప్రధాని చేయటమే లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మారేదెన్నడు.. అగ్గి ఆరేదెన్నడు?
[ 29-04-2024]
వేసవి అనగానే మనల్ని కలవరపెట్టేది అగ్ని ప్రమాదాలు. నిప్పు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో దాని వినియోగంలో ఏమరపాటు అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. -
3న నామినేషన్ వేస్తా: తీన్మార్ మల్లన్న
[ 29-04-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) ఖమ్మంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. -
చుకుబుకు రైలు.. గుండెల్లో గుబులు
[ 29-04-2024]
తెలంగాణలో రైల్వే అభివృద్ధికి దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ఏర్పాట్లు జిల్లా రైతుల్లో ఆందోళనకు కారణమైంది. -
బాధితులకు భరోసా.. పోక్సో ఈ బాక్స్
[ 29-04-2024]
నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. -
తలరాతను మార్చే ఓట్లు తరలిపాయె..!
[ 29-04-2024]
రెండు లోక్సభ స్థానాల్లో తలరాతలను మార్చే కీలక ఓటు బ్యాంకు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు తరలిపోయింది. విభజన సమయంలో మిగతా నియోజకవర్గాల ఓట్లు, సీట్లుపై స్పష్టత ఉన్నప్పటికీ ఐదు మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏపీకి వెళ్లాయి. -
టీటీలో జిల్లా మేటి!
[ 29-04-2024]
క్రీడా పోటీలు ఎప్పుడు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతంలో ఆయా క్రీడాంశంలో ఉన్న స్థితిగతుల్ని వివరిస్తుంది. ఆ అంశంలో సాధన చేస్తున్న క్రీడాకారుల ప్రతిభా పాటవాలు ఏ దశలో ఉన్నాయనే విషయాలను తేటతెల్లం చేస్తాయి. -
మూడు నెలలు ముహూర్తాలే లేవు!
[ 29-04-2024]
రానున్న మూడు నెలల పాటు శుభ ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు. మూఢాల కారణంగా వివాహాది శుభకార్యాలు, నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు, శంకుస్థాపనలు వంటి శుభ కార్యక్రమాలను జరపడం కుదరదని చెబుతున్నారు. -
కిరాణా కొట్లలో మద్యం విక్రయాలు
[ 29-04-2024]
ఖమ్మం కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఓ కిరాణా దుకాణంలో మద్యం సీసాలు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు ఈ ప్రాంతంలో నాలుగు బెల్ట్ దుకాణాలు ఉండేవి. -
ధర బాగుంది.. ధాన్యం బయటే అమ్మేద్దాం!
[ 29-04-2024]
యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. -
భారాస పదేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే: రఘురాంరెడ్డి
[ 29-04-2024]
పదేళ్ల భారాస పాలన వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!