logo

జాతీయ పోటీలకు విద్యార్థుల ఎంపిక

జాతీయ స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే శిక్షకుడు వి.పిచ్చయ్య గురువారం  తెలిపారు. నల్గొండలో మంగళ, బుధవారాల్లో జరిగిన రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండర్‌-14 బాలుర...

Published : 08 Dec 2023 02:50 IST

సత్తుపల్లి: జాతీయ స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఐదుగురు విద్యార్థులు ఎంపికైనట్లు కరాటే శిక్షకుడు వి.పిచ్చయ్య గురువారం  తెలిపారు. నల్గొండలో మంగళ, బుధవారాల్లో జరిగిన రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అండర్‌-14 బాలుర విభాగం నుంచి ఖమ్మానికి చెందిన ఎండీ అబ్దుర్‌రిహబ్‌ 35 కేజీల క్యాటగిరీ, సత్తుపల్లికి చెందిన జి.ఉదయ్‌కిరణ్‌ 60 కేజీల క్యాటగిరీ, అండర్‌-17 బాలికల విభాగం నుంచి తల్లాడకు చెందిన కటికి నిఖిత, అండర్‌-17 బాలుర విభాగం నుంచి సయ్యద్‌ ఆదిల్‌పాషా 58 కేజీల క్యాటగిరీ, కొత్తగూడెంకు చెందిన డి.సాయివరుణ్‌ 74 కేజీల క్యాటగిరీకి ఎంపికైనట్లు తెలిపారు. వీరంతా ఈనెల 16, 19న దిల్లీలో జరిగే జాతీయ స్కూల్‌ పోటీల్లో పాల్గొననున్నారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు