logo

పురస్కారం ప్రదానం

సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ నుంచి ఖమ్మం ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ అవార్డు అందుకున్నారు.

Published : 08 Dec 2023 03:14 IST

ఖమ్మం సారథినగర్‌, న్యూస్‌టుడే: సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ నుంచి ఖమ్మం ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి కొండపల్లి శ్రీరామ్‌ అవార్డు అందుకున్నారు. గతేడాది ఫ్లాగ్‌డేలో సేకరించిన స్వచ్ఛంద విరాళాల జాబితాలో ఖమ్మం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకోసం ప్రథమ బహుమతి ఖమ్మం జిల్లా శాఖకు దక్కింది. కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ సంచాలకుడు కర్నల్‌ రమేష్‌కుమార్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం నగరంలో...: పతాక దినోత్సవాన్ని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఖమ్మం నగరంలో జరిపింది. ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి గవర్నర్‌ అవార్డును తీసుకునేందుకు హైదరాబాద్‌ వెళ్లడంతో ఇక్కడి ఉద్యోగులు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్లు బృందంగా కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు వారియర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, ఇతర శాఖల అధికారుల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించారు. అధికారులకు సైనిక టోపీలు అందజేశారు. ఎన్‌సీసీ క్యాడెట్లు స్టిక్కర్లు అందించడం ద్వారా విరాళాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని