అమాత్యయోగం
ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒకేసారి ఇక్కడ ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కటం విశేషం. ప్రభుత్వంలో రెండోఅతిపెద్ద పదవిగా భావించే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన శాఖ మల్లు భట్టివిక్రమార్కకు దక్కనుండగా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అగ్రతాంబూలం
మంత్రులుగా ప్రమాణం చేసిన భట్టి, తుమ్మల, పొంగులేటి
ఈటీవీ- ఖమ్మం
ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో సరికొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో ఏ జిల్లాకు లేని విధంగా ఒకేసారి ఇక్కడ ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కటం విశేషం. ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పదవిగా భావించే డిప్యూటీ సీఎంతోపాటు కీలకమైన శాఖ మల్లు భట్టివిక్రమార్కకు దక్కనుండగా.. గతంలో రహదారులు, భవనాల శాఖలో తనదైన ముద్రవేసిన తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ మంత్రిగా ప్రమాణం చేశారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అమాత్య పదవి దక్కింది. కొద్ది నెలల క్రితం భారాసను వీడి కాంగ్రెస్లో చేరిన తుమ్మల, పొంగులేటి.. గులాబీ పార్టీని జిల్లాలో ఓడించి.. అమాత్యుల దాకా ఎదిగి తామేంటో నిరూపించారు. ముగ్గురు ముఖ్యనేతలకూ మంత్రి పదవులు దక్కటంతో హస్తం పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆకాంక్షిస్తున్నాయి.
పొంగులేటి.. తొలిసారి
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన వెంటనే అమాత్య పదవి దక్కించుకున్నారు. కాంగ్రెస్లో చేరిన అనతికాలంలోనే పార్టీలో తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి జిల్లాలో పదింట తొమ్మిది స్థానాలను కాంగ్రెస్, సీపీఐ కూటమి చేజిక్కించుకోవటంలో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ అధిష్ఠానం మెప్పుపొందిన నాయకుడిగా, రేవంత్రెడ్డికి సన్నిహితుడిగా పొంగులేటిని అమాత్యగిరి వరించింది.
భట్టి.. అంచెలంచెలుగా ఎదిగి..
మధిర గడ్డపై వరుసగా నాలుగోసారి విజయఢంకా మోగించి తనకు తిరుగులేదని నిరూపించిన మల్లు భట్టివిక్రమార్కకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దపీట దక్కింది. మధిర ఎమ్మెల్యేకు మంత్రిపదవి దక్కటం ఇది మూడోసారి. 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో శీలం సిద్ధారెడ్డి, 1972లో పీవీ నరసింహారావు సర్కారులో మరోసారి శీలం సిద్ధారెడ్డి అమాత్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మధిర నియోజకవర్గానికి మళ్లీ మంత్రిపదవి దక్కింది. ఎన్ఎస్యూఐ కార్యకర్తగా భట్టి విక్రమార్క రాజకీయ జీవితం ప్రారంభమైంది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు.
చరిత్రలో మొదటిసారి
ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో ఒకేసారి ముగ్గురు మంత్రులు ఉండటం ఇదే తొలిసారి. గతంలో కాంగ్రెస్, తెదేపా హయాంలోనూ ఇంతటి ప్రాధాన్యం దక్కలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో జిల్లా నుంచి ఒక్కరికే స్థానం లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుదీరిన సమయంలోనూ చాలాసార్లు ఒక్కరికే అమాత్యయోగం దక్కింది. 2004లో వైఎస్ ప్రభుత్వంలో ఇద్దరు నేతలు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావుకు మంత్రి పదవులు లభించాయి.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు ప్రభుత్వాల్లోనూ ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. తొలి ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు, మలి సర్కారులో పువ్వాడ అజయ్ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
తుమ్మల.. ఘనత
ప్రస్తుత మంత్రివర్గంలో అత్యంత సీనియర్గా తుమ్మల నాగేశ్వరరావు సరికొత్త చరిత్ర లిఖించారు. ఇప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేసి అరుదైన ఘనత సాధించిన తుమ్మల.. తాజాగా నాలుగో ముఖ్యమంత్రి మంత్రివర్గంలో స్థానం దక్కించుకోవటం గమనార్హం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కారులో మంత్రిగా వ్యవహరించారు. ఐదేళ్ల విరామం తర్వాత ఆయనకు మళ్లీ అమాత్య యోగం దక్కింది. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పదవులకే వన్నె తెచ్చిన నాయకుడిగా తుమ్మలకు పేరుంది. ప్రస్తుత ఎన్నికలతో కలిపి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల.. సుమారు 17 ఏళ్ల పాటు వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అశ్వారావుపేటలో ఏపీ మంత్రులు
[ 27-07-2024]
పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడి నష్ట పోయిన ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు వెళ్తున్న ఏపీ మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు.. -
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు