ప్రమాణ శ్రీకారం
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి.
జన సంద్రమైన ఎల్బీ స్టేడియం పరిసరాలు
భాగ్యనగరంలో రెపరెపలాడిన కాంగ్రెస్ జెండాలు
పండగ వాతావరణంలో ప్రజా ప్రభుత్వ బాధ్యతల స్వీకారం
ఈనాడు డిజిటల్, హైదరాబాద్, న్యూస్టుడే, నారాయణగూడ, బషీర్బాగ్ : త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం పండగ వాతావరణంలో జరిగింది. ఉదయం నుంచే స్టేడియానికి పార్టీ శ్రేణుల రాక ప్రారంభమైంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టేడియం, బషీర్బాగ్, గన్ఫౌండ్రీ, కంట్రోల్ రూం, పరిశ్రమ భవన్, పబ్లిక్గార్డెన్స్ ప్రాంతాలు జన సందోహంతో నిండిపోయాయి. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి దూరంలోనే వాహనాలను నియంత్రించడంతో అక్కడి నుంచి కాలినడకన చేరుకున్నారు. కాంగ్రెస్ అధినేతలు తరలివస్తున్న సందర్భంగా రోడ్డు పక్కన నిలబడి స్వాగతం పలికారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని చాటారు.
ప్రత్యక్ష ప్రసారాలు.. ఎల్ఈడీ తెరలు
స్టేడియం వెలుపల బషీర్బాగ్ ప్రెస్క్లబ్, ఆలియా స్కూలు, పరిశ్రమ్ భవన్ తదితర ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేశారు. లోపలికి వెళ్లే వీలులేక బయటే ఉండిపోయిన కార్యకర్తలు ఇక్కడి నుంచే వీక్షించారు. సాంస్కృతిక నృత్యాలు, డప్పుల దరువులు, మేళతాళాలు, బతుకమ్మలతో కళాకారులు అశేష జనానికి స్వాగతం పలికారు.
సచివాలయం... ట్యాంక్బండ్ వద్ద సందడి..
రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారానికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో సచివాలయం, ట్యాంక్ బండ్ రోడ్లో సందడి నెలకొంది. అంబేడ్కర్, బుద్ధుడి విగ్రహాల వద్ద, సచివాలయం ముందు, అమరవీరుల స్తూపం వద్ద ఫొటోలు దిగుతూ సంతోష పడ్డారు. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కులను తిలకించారు.
ఉచిత నీరు.. మరింత!
ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్లో ఉచిత తాగునీటి సరఫరా పరిమాణం పెంపుపై జలమండలి లెక్కలు వేస్తోంది. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని మరో 5 వేల లీటర్లకు పెంచి...25 వేల లీటర్లు అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో జలమండలి అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరిమాణం పెంపుతో ఎంతమందికి లబ్ధిచేకూరుతుందనే విషయమై వివరాలు సేకరిస్తున్నారు. రెండేళ్ల క్రితం బల్దియా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పటి ప్రభుత్వం గ్రేటర్లో ఈ హామీ ఇచ్చింది. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 12 లక్షల వరకు నల్లా కనెక్షన్లు ఉండగా...ఇప్పటివరకు ఇందులో 6 లక్షల మంది వినియోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా రూ.40కోట్ల వరకు జలమండలి రాయితీ కింద భరిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా అదనంగా 5 వేల లీటర్లకు పెంచడంతో మరో రూ.10 కోట్ల వరకు ఆదాయంలో కోత పడనుంది. అయితే ఈ పథకంపై జలమండలి రూ.వేయి కోట్ల పైనే భరించగా...అందులో సగం కూడా గత ప్రభుత్వం నుంచి రాకపోవడంతో నిధుల కొరత తప్పడం లేదు. ఈ విషయాన్ని అప్పట్లో ఉన్నతాధికారులు సర్కారు దృష్టికి తీసుకొచ్చేందుకు కూడా వెనకడుగు వేయడంతో బకాయిలు పేరుకు పోయాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన దృష్ట్యా ఈ వివరాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ భాగ్యం దక్కలేదు..
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి : రాష్ట్ర మంత్రివర్గంలో భాగ్యనగరం పరిధిలోని మూడు జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. ఈ జిల్లాల నుంచి కాంగ్రెస్ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి చోటు దక్కుతుందని అంతా భావించారు. గురువారం జరిగిన మంత్రివర్గంలో ఈ జిల్లాల్లోని ఎమ్మెల్యేను పరిగణనలోకి తీసుకోలేదు. త్వరలో జరిగే విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.
హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి గెలవలేదు. రంగారెడ్డి జిల్లాలో 3 చోట్ల గెలిచారు. ఈ ముగ్గురిలో షాద్నగర్ నుంచి వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తొలిసారి విజయం సాధించారు. ఇక ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం ఇది మూడోసారి. పార్టీ సీనియర్గా ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించాల్సి ఉంది. గురువారం ఏర్పాటైన మంత్రివర్గంలో మల్రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలుపుకొంటే నలుగురు ఉన్నారు. ఈనేపథ్యంలోనే మల్రెడ్డికి స్థానం లభించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు మైనార్టీ నేతను ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుందని హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్నేతలు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం