ప్లాట్ల పాట్లు తొలగేలా..!
మూడున్నరేళ్లుగా ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) ద్వారా అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈపథకం కింద గతంలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం: మూడున్నరేళ్లుగా ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) ద్వారా అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈపథకం కింద గతంలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. ప్లాట్లు, లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు గతంలో భారాస ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానం తీసుకొచ్చింది. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31 వరకు రెండు నెలల పాటు దరఖాస్తులు స్వీకరించింది. నిబంధనలు పాటించకుండా ఏర్పాటైన వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసి మోసపోయిన వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరటనివ్వటంతో అధిక సంఖ్యలో అర్జీలు సమర్పించారు. ఈ విధానంపై కొందరు హైకోర్టును ఆశ్రయించటంతో కొన్నేళ్లుగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పెండింగ్లో ఉంది.
ఆదాయ సమీకరణే లక్ష్యంగా..
నగరపాలిక/పురపాలికలు, గ్రామపంచాయతీల పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించటం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది. అందుకే ఎల్ఆర్ఎస్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్శాఖ ఉత్తర్వు- 131ని విడుదల చేసింది. దీని ప్రకారం ఖమ్మం జిల్లాలోని నగరపాలిక/పురపాలికల్లో 50,906, భద్రాద్రి జిల్లాలోని పురపాలికల్లో 9,334 మంది అర్జీలు సమర్పించారు. ప్లాటు విస్తీర్ణం, భూమి విలువను బట్టి ఎల్ఆర్ఎస్ రుసుమును సర్కారుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అనధికార ప్లాటుకు సంబంధించి రూ.1,000, వెంచర్కు రూ.10వేల చొప్పున దరఖాస్తు రుసుమును అధికారులు వసూలు చేశారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్రమబద్ధీకరిస్తే ఉభయ జిల్లాల నుంచి రూ.వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
గడువులోగా పూర్తి రుసుము చెల్లించాల్సిందే..
దరఖాస్తుదారులు ప్లాటు విస్తీర్ణం, సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పేర్కొన్న భూమి విలువ ఆధారంగా ఎల్ఆర్ఎస్ రుసుమును మార్చి 31లోపు చెల్లించాలి. అయితే ప్రభుత్వం విధించిన గడువుపై కొందరు అర్జీదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ రుసుములు రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉంటుందని, స్వల్ప గడువులోపు డబ్బులు సమకూర్చుకోవటం కష్టమవుతుందని చెబుతున్నారు. ప్లాటు కొని 2020లో దరఖాస్తు చేసుకోని వారికీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!