కాంగిరేసు గుర్రమెవరో?
ఖమ్మం లోక్సభ స్థానంలో పోటీపై కాంగ్రెస్లో ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూఅధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నవారు టికెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం లోక్సభ స్థానంలో పోటీపై కాంగ్రెస్లో ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూఅధిష్ఠానానికి దరఖాస్తు చేసుకున్నవారు టికెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. తాజాగా పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీచేసినా అత్యధిక ఆధిక్యంతో గెలిపిస్తామంటున్న నేతలు, ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు బరిలో నిలవకపోతే సీటు తమకే కేటాయించాలంటూ ఎవరికివారు ముమ్మరంగా ప్రయత్నిస్తుండటం గమనార్హం.
ఇప్పటికే 12 మంది దరఖాస్తు
కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్సభ స్థానం టికెట్ ఆశిస్తూ 12 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ ఉన్నారు. సీనియర్ నేత రేణుకాచౌదరి సీటు ఆశించినా అధిష్ఠానం రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించటంతో ఆమె బరి నుంచి తప్పుకున్నట్లయ్యింది. వీవీసీ ట్రస్ట్ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ సైతం టికెట్ దక్కించుకోవటం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమకు అవకాశం కల్పించాలంటూ సీనియర్ నాయకులు పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, నాగ సీతారాములు కోరుతున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జెట్టి కుసుమకుమార్ సైతం ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తుండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందన్నది హస్తం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
రాహుల్ బరిలో నిలిచేనా..?
శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒక్క నియోజకవర్గం మినహా మిగతా తొమ్మిదింట్లో కాంగ్రెస్, సీపీఐ కూటమి గెలుపొందింది. ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో కొత్తగూడెంలో సీపీఐ, మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది. ఈ స్థానంలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఇక్కడి నుంచి రాహుల్గాంధీ పోటీచేస్తే సునాయాస విజయం సాధించ వచ్చునని ఆపార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తద్వారా ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా రాహుల్గాంధీ పర్యటించేందుకు ఎక్కువ సమయం మిగులుతుందని అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి రాహుల్గాంధీ బరిలోకి దిగితే రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి బరిలో నిలిచే రేసుగుర్రమెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట