భరించొద్దు.. హరించొద్దు!
తన ఎకరం పొలంలో బొప్పాయి, పుచ్చ తదితర పండ్లతోపాటు స్థానిక సంతలో విక్రయించుకునేందుకు వీలుగా టమాటË, సొర, దోస లాంటి కూరగాయల్ని సాగుచేసేవారు. నాలుగేళ్లుగా కోతుల బెడద తట్టుకోలేక ఈ ఏడాది మిరప వేశారు.
కూసుమంచికి చెందిన ఓ రైతు
తన ఎకరం పొలంలో బొప్పాయి, పుచ్చ తదితర పండ్లతోపాటు స్థానిక సంతలో విక్రయించుకునేందుకు వీలుగా టమాటË, సొర, దోస లాంటి కూరగాయల్ని సాగుచేసేవారు. నాలుగేళ్లుగా కోతుల బెడద తట్టుకోలేక ఈ ఏడాది మిరప వేశారు. కోతులు దాన్నీ లేత దశలో పీకిపడేశాయి. కాపు పడిన తర్వాత వాటిలోనే ఎగురుతూ, గెంతుతూ కొమ్మల్ని విరిచేయడంతో మిరపకాయలు ఉపయోగానికి రాకుండా పోయాయి.
కోతులు పెడుతున్న బాధలు తట్టుకోలేక తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణికి చెందిన గద్దల గోపయ్య వాటిని బెదరగొట్టే ప్రయత్నంలో ఇంటి చుట్టూ తీగలు ఏర్పాటు చేసి విద్యుత్తు కనెక్షన్ ఇచ్చారు. ప్రమాదవశాత్తు ఆ తీగలకు తగిలి వారం క్రితం అతడు చనిపోయారు.
‘పదులు వందలాయె.. వందలు వేలాయె.. కొండముచ్చులకు మచ్చికాయె.. బాణసంచాకు భయపడకపాయె.. అడవి జంతువుల తొడుగులూ బెదరగొట్టకపోయె.. క్రూర మృగాల అరుపులు కూతవేటు దూరానికీ తరుమకపాయె.. అన్నదాతల సాగుకు ‘శత మర్కటమే.. పితలాటకమాయె..’
పంటలో..
కూసుమంచి, ఇల్లెందు న్యూస్టుడే: నకిలీ విత్తనాలు, సకాలంలో అందని ఎరువులు, చీడపీడల విజృంభణ, అకాల వర్షాలు.. ఇవన్నీ ఎప్పుడూ కొన‘సాగే’ సమస్యలే అని అన్నదాతలు మనసు రాయి చేసుకున్నారు. కానీ ఉభయ జిల్లాల్లో కర్షకుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ప్రధాన సమస్య కోతుల సంచారం. ప్రాంతాలకతీతంగా మర్కటాలు నానాటికీ విస్తరిస్తూ పంట చేలల్లో నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా తిష్ఠవేసి కూర్చుండటంతో రైతులు పొలంలోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కూరగాయలు సాగు చేసే పరిస్థితే ఏనాడో చేయిదాటి పోయింది. మర్కటాలు వరి కంకులను పీకేస్తున్నాయి. మొక్కజొన్న కంకులు, కాండాలను విరిచేస్తున్నాయి. పత్తి కాయల్ని నోటితో పెరికి పడేస్తున్నాయి. చివరకు మిరప పైర్లనూ పాడు చేస్తుండటంతో ఏ పంట వేయాలో అర్థంకాక రైతులు తలపట్టుకుంటున్నారు. రూ.వేలు వెచ్చించి సోలార్ విద్యుత్తు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం మినహా వలలు, బాణసంచా, పెద్ద చప్పుళ్లు.. ఇవేవీ పెద్దగా ఫలితం ఇవ్వటం లేదు.
ఆరుబయట కూర్చోవాలంటే భయం.. వీధిన నిలబడి ముచ్చటిద్దామంటే కలవరం.. వాకిలిని పొదరిల్లుగా మారుద్దామంటే ఇల్లుపీకి పందిరేస్తాయన్న సంశయం
మేడపైకి ఎక్కి పల్లెగాలి పీల్చేందుకూ భయం భయం.. ఊళ్ల నిండుగా కోతుల దండు.. గ్రామవాసుల్నీ కట్టిపడేస్తున్నాయ్..!
ఇంటిలో
కొన్నేళ్ల క్రితం వరకూ ఉభయ జిల్లాల్లోని పల్లెల్లో చాలా ఇళ్లు పొదరిళ్లుగా కనిపించేవి. కుటుంబ అవసరాలకు సరిపడా సహజసిద్ధ పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు పండించుకునేవారు. జూలూరుపాడు లాంటి మండల కేంద్రాల్లో ‘పెరడు’ ఆదాయ వనరుగా ఉండేది. ఇప్పుడు మచ్చుకైనా ఆ పరిస్థితి లేదు. గోడలపైకి ఎక్కి గుంపులు గుంపులుగా వస్తున్న కోతులు పచ్చని పొదరిల్లును చిందరవందర చేస్తున్నాయి. అదే ప్రయత్నంలో ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ఇక ఇంటిముందు దుకాణం సాగాలంటే దాన్ని బందీఖానాగా మార్చాల్సిందే. ఆరుబయట ఎండాల్సిన వడియాలు ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకోవాల్సి వస్తోందంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
ప్రాణాంతకమవుతున్న విద్యుత్తు తీగలు
కోతుల బారినుంచి పొలాలు, ఇళ్లను రక్షించుకునేందుకు కొందరు చేస్తున్న ప్రమాదకర ప్రయత్నాలు విలువైన ప్రాణాల్ని హరిస్తున్నాయి. మూగజీవాలను విద్యుదాఘాతానికి గురిచేసి బెదరగొట్టేందుకు ఏకంగా విద్యుత్తు వైర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు వారికి, కొన్నిసార్లు పొరుగువారికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాము పెట్టిన తీగల్నే ప్రమాదవశాత్తు తాకుతూ మృత్యువాత పడుతున్నారు. కరెంటు తీగలు తాకితే మూగజీవాలు బెదరటం కాదు మృత్యువాత పడతాయన్న విషయాన్ని, ఆ చర్య నేరం అన్న అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవటం లేదు.
ప్రత్యామ్నాయం ఇలా..
- వ్యవసాయ క్షేత్రాల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కోతుల ఆగడాలను అరికట్టేందుకు ఉత్తమ ప్రత్యామ్నాయం.
- ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలు విక్రయిస్తున్న దాని ప్రకారం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ఎకరాకు రూ.13-15 వేలు ఖర్చవుతుంది.
- అంత మొత్తం భరించలేని రైతులు సరిహద్దు పంచుకునే వారితో బృందాలుగా ఏర్పాటైతే కొంత ఖర్చు కలిసివస్తుంది.
- గృహావసరాలకు నెడ్క్యాప్ రాయితీ ఇస్తున్న చందాన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేస్తే మేలు. పొలాల్లో సోలార్ ఫెన్సింగ్కు రాయితీ ఇస్తే రైతులు ఏర్పాటు చేసుకునే అవకాశాలు మెరుగుపడతాయి.
- సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితులు లేనప్పుడు బృందాలుగా ఏర్పాటై కాపలా ఉండేందుకు యత్నించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్