logo

దోశలో ప్లాస్టిక్‌ వైర్‌

ఖమ్మం నగరంలోని ఇల్లెందు రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో వండిన దోశలో ప్లాస్టిక్‌ వైరు రావడంతో వాగ్వాదం జరిగిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది

Published : 29 Feb 2024 05:55 IST

హోటల్లో వాగ్వాదం

 

 ఇల్లెందు రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో అందించిన దోశలో ప్లాస్టిక్‌ వైర్‌

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలోని ఇల్లెందు రోడ్డులోని ఓ ప్రముఖ హోటల్లో వండిన దోశలో ప్లాస్టిక్‌ వైరు రావడంతో వాగ్వాదం జరిగిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ హోటల్లో టిఫిన్‌ చేసేందుకు వెళ్లి దోశ తేవాలని సూచించారు. సగం తిన్న అనంతరం మధ్యలో ప్లాస్టిక్‌ వైరు రావడంతో కంగు తిన్నారు. దీంతో హోటల్‌ యజమాని వద్దకు వెళ్లి ప్రశ్నించడంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బాధితుడు ఆహార తనిఖీ అధికారికి కిరణ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో గురువారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలపడంతోపాటు, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిమానా విధించాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని