ఆరోగ్య అవగాహనే ప్రధానం
స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆరోగ్య అవగాహనే ప్రధానమని.. తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందట ఉత్తర్వులు జారీ చేసింది
నాయుడుపేటలో సమావేశమైన ఎస్హెచ్జీ మహిళలు
ఖమ్మం బల్లేపల్లి, న్యూస్టుడే: స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆరోగ్య అవగాహనే ప్రధానమని.. తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రెండేళ్ల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలకు ఆరోగ్యంపై అవగాహన ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటారని.. తప్పని సరిగా నెలలో రెండో సమావేశం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని నిబంధన తీసుకొచ్చింది.
స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సమావేశాలు రెండేళ్ల కిందటి వరకు నెలకోసారి జరిగేవి. ఈ సమావేశంలో ఆర్థిక లావాదేవీలపై చర్చలు జరిగేవి. పొదుపు, బ్యాంకు లింకేజీ, రుణ వాయిదాల చెల్లింపులు వంటి అంశాలపై మాట్లాడుకోవడానికి సమావేశాలు నిర్వహించేవారు. మహిళల్లో ఆరోగ్యం, సామాజిక చైతన్యం కల్పించాలనే లక్ష్యంతో నెలలో రెండో సమావేశం సైతం నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో సంఘాల మహిళలు నెలలో రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రాధాన్యం పెరిగితే మేలు
నెలలో మొదటి సమావేశంలో ఆర్థిక అంశాలు ఉంటాయి కాబట్టి సభ్యులందరూ హాజరవుతున్నారు. అయితే రెండో సమావేశంలో ఆరోగ్య, సామాజిక విషయాలు ఉండటంతో సంఘాల సభ్యులు తక్కువగా పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి ద్వితీయ సమావేశాలు పకడ్బందీగా నిర్వహించినప్పుడే మహిళల ఆరోగ్య అవగాహనతో పాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
ద్వితీయ సమావేశంలోని అంశాలు..
ప్రతినెలా నిర్వహించే ద్వితీయ సమావేశంలో ఆరోగ్యమే ప్రధాన అంశంగా ఉంటుంది. ఎస్హెచ్జీ ల్లోని మహిళలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చర్చించాలి. ఆరోగ్య సిబ్బందిని ఆహ్వానించి సూచనలు, సలహాలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో కూరగాయలు పండించే విధానంపై అవగాహన కల్పించాలి. వంటింట్లో చెత్తని ఎరువుగా వాడుకునే విధానం తెలపాలి. హరితహారంలో భాగంగా పండ్ల మొక్కలు పెంచేలా ప్రోత్సహించాలి. సేంద్రియ పద్ధతిలో పండించిన నాణ్యమైన కూరగాయలు, పండ్లు తీసుకునేందుకు వీలుంటుంది. కౌమార బాలికలకు అవగాహన, బాలింతలు, గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలు, బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించడం, బాల్య వివాహాలు నిరోధించటం, వృద్ధుల సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
వివరాలు నమోదు చేస్తున్నాం..
- దర్గయ్య, డీఆర్డీఏ (ఐబీ), ఖమ్మం
ఎస్హెచ్జీ ద్వితీయ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనలు ఉన్నాయి. నెలలో జరిగే రెండు సమావేశాలను నమోదు చేస్తున్నాం. ఆరోగ్యంతోపాటు పలు అంశాలపై సంఘాల మహిళలకు చైతన్యం కలిగించే చర్చలు జరగాలని, అందరూ పాల్గొనేలా చూడాలని మా సిబ్బందిని ఆదేశించాం. గ్రామాల్లో జరిగే సామాజిక కార్యక్రమాల్లో మహిళలు పాల్గొనేలా ప్రోత్సహిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే