దాతలు లేనిచోట వెతలే.
పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గత నెల రోజుల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు
పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గత నెల రోజుల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు పాఠశాలల్లో ఆకలి బాధలు తప్పడం లేదు. విరామ సమయాల్లో అల్పాహారం ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఇల్లెందు, న్యూస్టుడే: ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. ఈ తరగతుల్లో పాఠ్యాంశాల పునఃశ్చరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రత్యేక తరగతుల కోసం విద్యార్థులు నిర్దేశించిన సమయం కంటే ముందుగానే పాఠశాలలకు వస్తున్నారు. సాయంత్రం ఇల్లు చేరేసరికి సుమారు 6.30 నుంచి గంటలవుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం తినే భోజనంతోనే సాయంత్రం వరకూ వేచిఉండాల్సిన పరిస్థితి.
నిధుల కొరత..
గతంలో ప్రభుత్వం పది విద్యార్థులకు అల్పాహారం కోసం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిధులు మంజూరు కాలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఉసే లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అల్పాహారం అందిస్తున్నారు. ఎలాంటి ప్రోత్సాహం లేని పాఠశాలల్లో మాత్రం సాయంత్రం వరకు విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేక తరగతుల సమయంలో విద్యార్థులు ఆసక్తి చూపించలేకపోతున్నారని, సాయంత్రానికి నీరసించి పోతున్నారని కొంతమంది ఉపాధ్యాయులంటున్నారు.
ఇదీ అవసరం...
విద్యార్థులకు పోషకాహారం సమకూరిస్తే చదువులపై శ్రద్ధ చూపుతారు. కిచిడీ, బాదంపాలు, బిస్కెట్లు తదితర ఇతర బలవర్ధక పదార్థాలు అందించటం ద్వారా ఉత్సాహంగా ఉంచొచ్చని వైద్య నిపుణులంటున్నారు. సమయానికి తగిన ఆహారం అందిస్తే ఆసక్తితో చదివి, మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ