బోధన ప్రత్యేకం గురూ
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఇప్పుడు మరింత భరోసా కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో వీరి బోధనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ నియామకం కోసం పోస్టులు ప్రకటించింది.
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఇప్పుడు మరింత భరోసా కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో వీరి బోధనకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ నియామకం కోసం పోస్టులు ప్రకటించింది. దివ్యాంగుల బోధనకు ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించటం ఇదే తొలిసారి కావడం విశేషం. రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్కు 220 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఎస్జీటీకి 796 పోస్టులు కేటాయించారు. వీటిలో ఖమ్మం జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ 8, ఎస్జీటీ 29 పోస్టులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ అసిస్టెంట్ 8, ఎస్జీటీ 31 పోస్టులు ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దివ్యాంగులైన విద్యార్థులకు బోధన మరింత మెరుగవ్వనుంది.
ఆత్మన్యూనత తొలగించేందుకు....
ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధనకు ప్రత్యేకంగా పాఠశాలలు ఉండటం వల్ల వారిలో ఆత్మన్యూనత భావం ఏర్పడుతుందని భావించి ఇప్పుడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటే వీరికీ ఉపాధ్యాయులు బోధించేలా ఏర్పాట్లు చేశారు. బాలలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందించాలని చట్టం చెబుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 0-19 సంవత్సరాల బాలబాలికలు దీని పరిధిలోకి వస్తారు. బాలలంతా కచ్చితంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో ఉండాలి. లేని వారు బడి బయట ఉన్నట్లే లెక్క. ఇలాంటి వారు బాల కార్మికుల కిందకు వస్తారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన
గతంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు బోధన ప్రత్యేకంగా ఉండేది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సమ్మిళిత విద్యలో భాగంగా ప్రతి పాఠశాల(సహిత పాఠశాల)గా ఉండాలని ఆదేశించింది. మామూలు పిల్లలతో పాటు మానసిక, శారీరక దివ్యాంగ పిల్లలను ఒకే పాఠశాలలో కలిసి చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలను దీనికి అనుగుణంగా తయారు చేశారు. కొన్ని పాఠశాలల్లో భౌతికపరమైన వసతుల కల్పన, విద్యాపరమైన సంసిద్ధతకు అనుగుణంగా తీర్చిదిద్దారు. అవరోధాలులేని విధంగా విద్యార్థుల రాకపోకలు కల్పించారు. ప్రతి పాఠశాలలో ర్యాంపులు నిర్మించారు. ప్రత్యేకంగా తాగునీటి సౌకర్యం, శౌచాలయాలు ఏర్పాటు చేశారు. జారుడు ప్రదేశాలు లేకుండా, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తయారు చేశారు.
విద్యాపరమైన సంసిద్ధత
విద్యాపరమైన సంసిద్ధతలో భాగంగా బోధనకు అనుకూలమైన నైపుణ్యాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అంధులు, వినికిడి సమస్య, మానసిక దివ్యాంగులు ఇలా పలు రకాలైన వారికి బోధించాలి. ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేక పుస్తకాలు, బ్రెయిలీ పరికరాలు, ఇతర అవసరమైన ఉపకరణాలు సమకూర్చారు. ఉపాధ్యాయులందరూ ప్రత్యేక పిల్లలకు ఎలా బోధించాలి, విద్యను అందించటంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించేందుకు వీలుగా ఐదు రోజుల పాటు ఇటీవల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీని గురించి పునశ్చరణ చేస్తున్నారు. విద్యార్థుల నమోదు కోసం ‘ప్రశస్థ్’ యాప్ను రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట