కక్షలు పోయి.. ఆకాంక్షలు మిగిలి
ప్రజల ఆలోచనలు మారాయి.. పరిస్థితులు సహకరిస్తున్నాయి.. నచ్చిన వ్యక్తులను ఎన్నుకునేందుకు ఓటర్లు స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నారు.. రక్తపాతం సృష్టించకుండానే అధికార మార్పిడికి పూనుకుంటున్నారు.
ఈటీవీ, ఖమ్మం
ప్రజల ఆలోచనలు మారాయి.. పరిస్థితులు సహకరిస్తున్నాయి.. నచ్చిన వ్యక్తులను ఎన్నుకునేందుకు ఓటర్లు స్వేచ్ఛగా అడుగులు వేస్తున్నారు.. రక్తపాతం సృష్టించకుండానే అధికార మార్పిడికి పూనుకుంటున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం అదే స్థాయిలో చొరవ చూపుతున్నాయి.
గతంలో..
ఎన్నికలంటే ఆధిపత్య పోరుకు సంబంధించినవి. కక్షలు, ఘర్షణలతో పాటు రాజకీయ హత్యలు జరిగేవి. పోలింగ్ సమయంలో పోలీసులు, అధికారులూ అనేక అవస్థలు పడేవారు.
ప్రస్తుతం
ఎన్నికలంటే ప్రజల సమస్యలు, ఆకాంక్షలకు సంబంధించినవి. ప్రశాంత వాతావరణంలో ఓటేసేందుకు అధిక మంది ఇష్టపడుతున్నారు.
ఎన్నికల తీరుపై ప్రజలకు అవగాహన పెరుగుతోంది. రాజకీయ పార్టీల వైఖరిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఎన్నికల నగరా మోగిందంటే.. ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులతో పల్లెలు రక్తమోడేవి. అనేక కుటుంబాలు వీధినపడేవి. అనుభవపూర్వకంగా తెలుసుకోవటం, సమాజ పోకడపై అవగాహన పెంపొందించుకోవటం తదితర కారణాలతో ప్రశాంత వాతావరణాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. భద్రాద్రి జిల్లాలో మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరుగుతుండటమే ఆందోళన కలిగించే అంశం.
స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేసేలా..
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్న ప్రాంతాలను తదుపరి ఎన్నికల్లో అతి సమస్యాత్మక కేంద్రాల జాబితా నుంచి అధికారులు తొలగిస్తూ వస్తున్నారు. భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన స్వీప్ (సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం)లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావటంతో సి-విజిల్, సువిధ, ఎన్కోర్ వంటి యాప్లు ఎన్నికల క్రతువు సజావుగా సాగేలా ఉపకరిస్తున్నాయి. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు వివిధ దశల్లో కేంద్ర బలగాలు కవాతులు నిర్వహిస్తూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేసే పరిస్థితులను కల్పిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినియోగానికి తగ్గట్లు ఎరువు నిల్వలు
[ 27-07-2024]
వైరా, పాలేరు జలాశయాలు మినహా మిగతా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. -
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
[ 27-07-2024]
తాను ఎంపీడీఓనని, న్యాయశాఖ నిపుణుడి జ్ఞాపకార్థం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నానని, శంకుస్థాపనకు రావాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయిని ఆహ్వానించాడు. -
వసతులు లేక అవస్థలు!
[ 27-07-2024]
పేద పిల్లలు, మారుమూల ప్రాంత విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. -
అవగాహనకే పరిమితం.. ఆచరణలో విఫలం..!
[ 27-07-2024]
శకునం చెప్పే బల్లే కుడితిలో పడ్డట్టు తయారైంది పరిస్థితి. నిత్యం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం గురించి వల్లించే నగరపాలక సంస్థ తన సొంతింటిని చక్కదిద్దుకోకపోవటం విస్మయం కల్గిస్తోంది -
నిరీక్షించి.. నీరసించి
[ 27-07-2024]
ఆర్టీసీ ఉద్యోగుల ‘వేతన సవరణ’ బాండ్ల నగదు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2013 సంవత్సరంలో రెండు పీఆర్సీలకు సంబంధించిన బకాయిలకు అప్పటి ప్రభుత్వం 2014 ఏప్రిల్లో బాండ్లు అందించింది. -
వాగులు పొంగితే.. రాకపోకలకు ఇక్కట్లే..!
[ 27-07-2024]
వర్షాకాలంలో వాగులు, వంకలు పొంగినా, గోదావరిలో వరద పోటెత్తినా అనేక గ్రామాలకు రహదారి కష్టాలు ఎదురవుతున్నాయి. -
సైబర్ కేసులో గంట వ్యవధిలో రూ.3.4 లక్షలు ఫ్రీజ్: సీపీ
[ 27-07-2024]
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు గుర్తించిన గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే బాధితులకు వేగంగా మేలు జరుగుతుందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అన్నారు. -
ఉన్నవెంత..? తిన్నదెంత..?
[ 27-07-2024]
మిషన్ భగీరథ ఇంటింటి సర్వేలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలో నల్లా కనెక్షన్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆగస్టు 5నుంచి పలు రైళ్లు రద్దు
[ 27-07-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ద.మ.రైల్వే అధికారులు పలు రైళ్లను కొద్ది రోజులపాటు రద్దు చేశారు. -
పసిడి వర్ణంలో రాములోరి దర్శనం
[ 27-07-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి శుక్రవారం పసిడి వర్ణంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
సర్వజనాసుపత్రిలో ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 27-07-2024]
ఖమ్మం సర్వజనాసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
నలుగురు పిల్లల తండ్రిని కబళించిన డెంగీ
[ 27-07-2024]
నిరుపేద గిరిజన కుటుంబంలో దోమ విషాదాన్ని చిమ్మింది. చికిత్సల కోసం వైద్యశాలలో చేరినప్పటికీ నిండు ప్రాణాన్ని కబళించింది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 27-07-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీ చేస్తున్న దొంగను పాల్వంచ పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.