logo

kurnool: గడ్డి మందుతాగి వృద్ధ దంపతులు ఆత్మహత్య

వృద్ధ దంపతులు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 25 May 2024 15:48 IST

డోన్ నేర విభాగం: వృద్ధ దంపతులు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో చోటుచేసుకుంది. జలదుర్గం గ్రామానికి చెందిన సుంకన్న (59), లక్మిదేవి (44) ఆర్థిక సమస్యల కారణంగా కొడుకుతో గొడవపడి వృద్ధ దంపతులు గడ్డి మందు తాగారు. గమనించిన స్థానికులు డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన మద్యం కోసం కర్నూల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ దంపతులిద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి ఎస్సై జగదీష్ రెడ్డి తెలిపారు.

telugu news, andhra pradesh news, kurnool news

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని