logo

Kurnool: ప్రతి ఒక్కరికి భక్తి ఉండాలి

సమాజంలో ప్రతి ఒక్కరు భక్తి భావంతో ఉండాలని శ్రీకూర్మనారాయణస్వామి భక్తి గీతాల రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు మానుకింద నారాయణ అన్నారు.

Updated : 25 May 2024 16:43 IST

ఆస్పరి: సమాజంలో ప్రతి ఒక్కరు భక్తి భావంతో ఉండాలని శ్రీకూర్మనారాయణస్వామి భక్తి గీతాల రచయిత, విశ్రాంత ఉపాధ్యాయుడు మానుకింద నారాయణ అన్నారు. శనివారం మండలంలోని హలిగేర సమీపంలోని శ్రీకూర్మక్షేత్రంలో వెలసిన కూర్మనారాయణస్వామికి ఆలయ నిర్వహకులు నరేష్, రంగస్వామి, అడివప్పల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకూర్మనారాయణస్వామిపై నారాయణ రచించిన ఐదు పాటలను పాడించి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు కూర్మనారాయణ స్వామి ఆలయంపురాతమైన ఆలయఇది అన్నారు. వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాల కల్పనకు దాతలు తమ వంతుగా ముందుకు రావాలన్నారు. ఇక్కడ భక్తుల సహకారంతో ప్రతి శనివారం అన్నదాన సేవ నిర్వహిస్తునట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని