ఠాణాలో రూ.75 లక్షల సొత్తు మాయం
కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో రూ.75 లక్షల సొత్త్తు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసి సంచలనంగా మారింది.
కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో రూ.75 లక్షల సొత్త్తు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసి సంచలనంగా మారింది. 2021 జనవరి 28 రాత్రి కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్టు వద్ద సెబ్ సీఐ లక్ష్మీదుర్గయ్య వాహనాలు తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్ కారును ఆపి తనిఖీ చేయగా శాతనభారతి, మణికందన్(తమిళనాడు) అనే ఇద్దరు వ్యాపారుల వద్ద 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2.05 లక్షల నగదును గుర్తించారు. వీటికి ఎలాంటి ఆధారపత్రాలు లేకపోవటంతో తనిఖీ అధికారులు సొత్తును సీజ్ చేసి అప్పటి కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్ సీఐ విక్రమ్సింహాకు అప్పగించారు. వాణిజ్యపన్నులశాఖకుగాని ఆదాయపన్నులశాఖకు అప్పగించలేదు. పోలీసుఅధికారులు సదరు సొత్తును పోలీసుస్టేషన్లోని బీరువాలో ఉంచారు. ఓ మహిళా కానిస్టేబుల్కు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. తర్వాత సీఐ విక్రమ్సింహా బదిలీ అయిన తర్వాత సీఐ కంబగిరి రాముడు కొంతకాలం పనిచేసి అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ఆతర్వాత 2022 మార్చి నెలలో సీఐ శేషయ్య సదరు స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. 2022 నవంబరులో సీఐ శేషయ్య బదిలీ కాగా సీఐ రామలింగయ్య వచ్చారు. అప్పటి వరకు వెండికి సంబంధించిన వ్యాపారులు స్టేషన్కు రాలేదు. ఈనెల 27వ తేదీన వెండి యజమానులైన వ్యాపారులుశాతనభారతి, మణికందన్ న్యాయస్థానం నుంచి అనుమతి పొంది కర్నూలు తాలుకా అర్బన్ స్టేషన్కు వచ్చి సొత్తు అప్పగించమని అడిగారు. సీఐ రామలింగయ్య బీరువా తెరిచి చూసి కంగుతిన్నారు. అసలు బీరువాలో 105 కిలోల వెండిగానీ, డబ్బుగానీ లేకపోవటంతో నిర్ఘాంతపోయారు.
ఇంటి దొంగలు ఎవరు..: తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్ 105 కిలోల వెండిని తస్కరించిన ఇంటి దొంగలు ఎవరన్నది మిస్టరీగా మారింది. 2021 నుంచి సీఐ విక్రమ్సింహాతో సహా ముగ్గురు సీఐలు బదిలీ అయి ప్రస్తుతం నాలుగో సీఐగా రామలింగయ్య పనిచేస్తున్నారు. అధికారులతోపాటు సిబ్బంది పలువురు బదిలీ అయ్యారు. ఏ సీఐ హయాంలో వెండి అపహరణకు గురైందనేది అంతుచిక్కకుండా ఉంది. ఉన్నతాధికారులు నలుగురు సీఐలందరినీ విచారించినట్లు తెలిసింది. గతంలో మద్యం సీసాలు తస్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న హెడ్కానిస్టేబుల్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెండి అమ్ముకుని సొమ్ము చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటారా లేక కేసు ఏ విధంగా చేధిస్తారన్నది ఉత్కంఠగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?