చెల్లికి పిల్లలు లేరని..
బాలుడి కిడ్నాప్ కేసులో నిందితులైన కర్నూలు శరీన్నగర్కు చెందిన కేదాసు లక్ష్మీనారాయణమ్మ, ఆమె చెల్లెలు.. ఎమ్మిగనూరుకు చెందిన మునీశ్వరి, ఆమె మరిది నాగార్జునను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
బాలుడిని కిడ్నాప్ చేయించిన అక్క
కేసు ఛేదించిన పోలీసులు
నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కె.వి.మహేష్, సీఐ శంకరయ్య, ఎస్సై రామయ్య
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : బాలుడి కిడ్నాప్ కేసులో నిందితులైన కర్నూలు శరీన్నగర్కు చెందిన కేదాసు లక్ష్మీనారాయణమ్మ, ఆమె చెల్లెలు.. ఎమ్మిగనూరుకు చెందిన మునీశ్వరి, ఆమె మరిది నాగార్జునను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ శంకరయ్య, ఎస్సై రామయ్యతో కలిసి డీఎస్పీ కె.వి.మహేష్ గురువారం వివరాలు వెల్లడించారు.
నగరంలోని శరీన్నగర్లో లలిత నివసిస్తున్నారు. ఆమె భర్త శివకుమార్ అనారోగ్యంతో గతంలో చనిపోయారు. ఆమెకు ప్రశాంతకుమార్ (9), ప్రవీణ్కుమార్ (7) కుమారులు ఉన్నారు. ఆమె ఇంటి సమీపంలో నివాసం ఉండే కేదాసు లక్ష్మీనారాయణమ్మకు సంతానం లేకపోవటంతో భర్త తిరుపాలు వదిలేశాడు. ఆమె ఇళ్లలో పాచి పని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. ఎమ్మిగనూరులో నివాసం ఉండే ఈమె చెల్లి మునీశ్వరికి పిల్లలు కలగకపోవటంతో దిగులు చెందేవారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణమ్మకు లలిత పరిచయమైంది. తన చెల్లెలికి ప్రశాంత్నుగానీ, ప్రవీణ్ను దత్తత ఇవ్వాలని లక్ష్మీనారాయణమ్మ పలుమార్లు కోరినా లలిత నిరాకరించింది. దీంతో ఆమె తన చెల్లితో కలిసి కిడ్నాప్ పథకం రచించింది. అందులో భాగంగా ఉగాది రోజున కల్లూరులోని చౌడేశ్వరిదేవి ఆలయం వద్ద జరిగే జాతరకు వెళ్దామని లలితమ్మ, ఆమె పిల్లలను లక్ష్మీనారాయణమ్మ నమ్మించి తీసుకెళ్లింది. తనకు దాహం వేస్తోందని, నీళ్లు తీసుకురమ్మని లక్ష్మీనారాయణమ్మ చెప్పటంతో లలిత తన చిన్న కుమారుడిని ఆమె వద్ద వదిలి పెద్ద కుమారుడిని వెంట బెట్టుకుని వెళ్లింది. అప్పటికే అక్కడే సిద్ధంగా ఉన్న మునీశ్వరి, నాగార్జునకు ప్రవీణ్ను అప్పగించటంతో వారు పిల్లాడిని తీసుకుని ఎమ్మిగనూరు వెళ్లిపోయారు. నీళ్లతో వచ్చిన లలిత తన చిన్న కుమారుడు ఎక్కడా అని ప్రశ్నించగా నీ వెనుకే వచ్చినట్లు లక్ష్మీనారాయణమ్మ కట్టుకథ అల్లింది. అంతా వెతికినా ప్రవీణ్ జాడ తెలియకపోవటంతో లలిత కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనారాయణమ్మ ప్రవర్తన పట్ల అనుమానం కలగటంతో పోలీసులు విచారించగా అసలు విషయం చెప్పింది. ఎమ్మిగనూరు వెళ్లి నాగార్జున, మునీశ్వరి దంపతుల వద్ద ఉన్న ప్రవీణ్ను స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి
[ 27-07-2024]
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు