నేర వార్తలు
ఈనెల 14న అదృశ్యమైన నందికుంట గ్రామానికి చెందిన నిమ్మల వెంకటేశ్వర్లు (32) మృతదేహం గురువారం గ్రామ సమీపంలోని భవనాసి వాగులో లభ్యమైంది.
కూరగాయల చోరీకి వెళ్లి మృతి
నిమ్మల వెంకటేశ్వర్లు (పాతచిత్రం)
కొత్తపల్లి, న్యూస్టుడే : ఈనెల 14న అదృశ్యమైన నందికుంట గ్రామానికి చెందిన నిమ్మల వెంకటేశ్వర్లు (32) మృతదేహం గురువారం గ్రామ సమీపంలోని భవనాసి వాగులో లభ్యమైంది. ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు.. తన భర్త కనిపించడం లేదంటూ అతని భార్య శివమ్మ ఈనెల 17న కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎస్సై ముబీన్తాజ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈనెల 14న రాత్రి పాలెంచెరువు గూడేనికి చెందిన కొంతమంది తన భర్తకు ఫోన్చేసి పిలిచారంటూ భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పాలెంచెరువుకు గూడేనికి చెందిన లింగన్న, అంకమ్మ, లక్ష్మిని విచారించగా.. వెంకటేశ్వర్లుతో కలిసి ఆ రోజు రాత్రి నందికుంట సమీపంలోని పొలాల్లో కూరగాయలు తెచ్చుకునేందుకు వెళ్లినట్లు చెప్పారు. ఆ పొలానికి కాపలాదారు అడవి పందులు రాకుండా ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలు తగలడంతో వెంకటేశ్వర్లు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని వెల్లడించారు. మంటలు రావడంతో తాము భయంతో పరారైనట్లు వివరించారు. పొలం కాపలాదారు దుర్గారావు మరికొందరితో కలిసి మృతదేహాన్ని వాగులో పడేశారని సీఐ వివరించారు. ఆరోజు నుంచి కనిపించకుండాపోయిన దుర్గారావును గురువారం అదుపులోకి తీసుకుని విచారించగా భవనాసి వాగులో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని చూపాడని చెప్పారు. దుర్గారావుపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తమ భర్తను పాలెంచెరువు గూడెం వాసులు హత్య చేసుంటారని మృతుడి భార్య శివమ్మ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా పోలీసులు విచారించాలని కోరుతున్నారు.
ఉరేసుకుని రైతు బలవన్మరణం
మహేశ్ (పాత చిత్రం)
యల్లావత్తుల (రుద్రవరం), న్యూస్టుడే: మండలంలోని యల్లావత్తుల గ్రామానికి చెందిన మహేశ్ (32) అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నిరంజన్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మహేశ్ తన తండ్రి శివశంకర్కు చెందిన 10 ఎకరాల పొలంతోపాటు మరో 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మినుము, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశారన్నారు. పంటల సాగుకు రూ.6.80 లక్షలు అప్పు చేశారన్నారు. పది రోజుల కిందట వచ్చిన వడగళ్ల వానకు పంటంతా నాశనం అయ్యిందన్నారు. పంట చేతికి రాకపోవడంతో అప్పులు ఎలా కట్టాలంలూ బాధపడుతూ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంకాకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. మృతదేహాన్ని పరిశీలించి తండ్రి శివశంకర్ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మహేశ్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య శ్రావణి అనారోగ్యంతో 9 నెలల కింద మృతి చెందిందన్నారు.
పోలీసుల అదుపులో నకిలీ నోట్ల ముఠా
నంద్యాల నేరవిభాగం, న్యూస్టుడే : నకిలీ నోట్లు చెలామణికి పాల్పడుతున్న ముఠాను నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జమ్మలమడుగుకు చెందిన దస్తగిరికి విశాఖపట్నం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన ముఠా సభ్యులు ఫోన్చేసి రూ.10 లక్షలు ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని నమ్మబలికారు. డబ్బు తీసుకుని నంద్యాలకు రమ్మని పిలిచారు. గురువారం డబ్బు తీసుకుని వచ్చిన దస్తగిరిని ముఠా సభ్యులు కారులోకి ఎక్కించుకుని నంద్యాల పట్టణ శివారుకు తీసుకెళ్లారు. పీవీ నగర్ సమీపంలో డబ్బు లాక్కొని దస్తగిరిని కొట్టి కారులో పరారయ్యారు. బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అప్రమత్తమై గడివేముల వైపు వెళుతున్న కారును గుర్తించారు. గడివేముల పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు కారును అడ్డగించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని నంద్యాల డీఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేసినట్లు తెలిసింది. డీఎస్పీ ఆధ్వర్యంలో నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గోనెగండ్ల, న్యూస్టుడే: గోనెగండ్ల మండలం ఎస్.లింగందిన్నె గ్రామశివారులోని బళ్లారి-పత్తికొండ రహదారిలో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై తిమ్మారెడ్డి కథనం ప్రకారం.. కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన షేక్ జానీబాషా(21) దేవనకొండ మండలంలోని బండపల్లి గ్రామంలో జరుగుతున్న దేవరకు తండ్రి షేక్ మహబూబ్బాషాతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. దేవర ముగించుకొని తండ్రి, కుమారుడు స్వగ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలోప్రధాన రోడ్డులో ఓ కారు అతివేగంతో వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమైన జానీబాషా అక్కడిక్కడే మృతి చెందగా, మహబూబ్బాషా తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు